Webdunia - Bharat's app for daily news and videos

Install App

మిర్యాలగూడలో పరువు హత్య.. కమ్మకులం అమ్మాయిని ప్రేమించి...

తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లా మిర్యాలగూడలో పరువు హత్య జరిగింది. దళిత యువకుడు ఒకరు కమ్మ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్న పాపానికి దళిత యువకుడుని దారుణంగా హత్యచేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన

Webdunia
శుక్రవారం, 14 సెప్టెంబరు 2018 (17:57 IST)
తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లా మిర్యాలగూడలో పరువు హత్య జరిగింది. దళిత యువకుడు ఒకరు కమ్మ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్న పాపానికి దళిత యువకుడుని దారుణంగా హత్యచేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
 
మిర్యాలగూడకు చెందిన దళిత యువకుడు ప్రణయ్. అదే ప్రాంతానికి చెందిన కమ్మకులానికి చెందిన అమృత అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరూ పెద్దలను ఎదిరించి ఒక్కటయ్యారు. గత యేడాదిన్నరగా కలిసి కాపురం చేస్తున్నారు. ఈ క్రమంలో అమృత గర్భందాల్చింది. 
 
దీంతో నల్లొండ జిల్లా మిర్యాలగూడలో ఉన్న ఓ ఆస్పత్రికి ఆరోగ్య చెకప్‌ కోసం తన భార్య జ్యోతిని తీసుకొచ్చాడు. వైద్య పరీక్షలన్నీ పూర్తయిన తర్వాత తన వెంట తీసుకుని బయలుదేరాడు. ఈ క్రమంలో వెనుక నుంచి పెద్ద కత్తితో వచ్చిన ఓ యువకుడు ప్రణయ్‌ మెడపై అత్యంత పాశవికంగా నరికాడు. 
 
ఒక్క దెబ్బతో కిందపడిపోగా, రెండోసారి మెడపై నరకడంతో ప్రాణాలు విడిచాడు. పక్కా ప్లాన్‌తో ఆస్పత్రి ప్రధాన ద్వారం వద్దే ఈ హత్య జరిగింది. ఈ దాడిని అడ్డుకునేందుకు అమృత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఒక్కసారిగా జరిగిన ఈ ఘటనతో భయభ్రాంతులకు గురైన ఆమె అక్కడ నుంచి ఆస్పత్రిలోకి పరుగులు తీసింది.  
 
ఈ హత్యకు సంబంధించిన దృశ్యాలు ఆస్పత్రిలో అమర్చిన సీసీటీవీ ఫుటేజీల్లో స్పష్టంగా నమోదైంది. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజమౌళి దంపతులకు అరుదైన గౌరవం... ఆహ్వానం కూడా...!!

కథంతా చెప్పేసిన థీమ్ ఆఫ్ క‌ల్కి లిరిక‌ల్ వీడియో

మైఖేల్ జాక్సన్‌కు కలిసిరానిది.. థ్రిల్లర్‌ ఇచ్చిన గిఫ్ట్

నిఖిల్.. స్వయంభు కొత్త షెడ్యూల్ మారేడుమిల్లిలో ప్రారంభం

లంచ‌గొండుల‌పై సేనాప‌తి స్వైర విహారం భారతీయుడు 2’ ట్రైలర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

పచ్చిమిరపకాయలను నానబెట్టిన నీటిని తాగితే?

పిల్లలు, మహిళలు పిస్తా పప్పులు తింటే?

తర్వాతి కథనం
Show comments