Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మా... నాన్నా అంటున్నా... కన్నకుమార్తెను కట్టేసి కొట్టి చంపిన తండ్రి.. ఎందుకంటే?

Webdunia
శుక్రవారం, 28 జూన్ 2019 (19:08 IST)
చిత్తూరు జిల్లా పలమనేరులో దారుణం చోటుచేసుకుంది. కులాంతర వివాహం చేసుకున్నదని కన్నకూతుర్ని గొడ్డును కొట్టినట్లు కొట్టికొట్టి చంపేశాడు ఆమె తండ్రి. అతడికి చేతులు ఎలా వచ్చాయో... అమ్మా... నాన్నా అంటూ అరిచి అభ్యర్థించినా ఆమెను వదల్లేదు.
 
వివరాల్లోకి వెళితే... ఒకటిన్నర సంవత్సరం క్రితం పలమనేరు సమీపంలోని ఉసరపెంట గ్రామానికి చెందిన హేమావతి, కేశవులు ప్రేమించుకున్నారు. కేశవులు దళితుడు కావడం.. హేమావతి కమ్మ సామాజికవర్గానికి చెందినవారు కావడంతో పెద్దలు వివాహానికి అంగీకరించలేదు. దీంతో ఇద్దరు ఇంటి నుంచి పారిపోయి వివాహం చేసుకున్నారు. 
 
సంవత్సన్నరక్రితమే వీరిద్దరికి వివాహమైంది. కేశవులు వేరు కాపురం పెట్టి జీవనం సాగిస్తున్నాడు. ఏడు రోజుల క్రితం వీరికి పండంటి మగబిడ్డ జన్మించాడు. కేశవులు తల్లిదండ్రులు అన్ని మరిచిపోయి కోడలు, కొడుకును ఇంటికి తీసుకెళ్ళాలనుకున్నారు. 
 
మధ్యాహ్నం ఆటోలో ఇంటికి వెళుతుండగా హేమావతి తండ్రి ఇంకా బంధువులు ఆటో ఆపి కేశవులపై దాడి చేశారు.హేమావతిని తాళ్లతో బంధించి అత్యంత దారుణంగా కొట్టి చంపేశారు. హేమావతి మృతదేహాన్ని పక్కనే ఉన్న చెత్తగుంట పొలంలో పడేశారు. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments