Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాన్సాస్ ట్రస్ట్ ఈవోకు హైకోర్ట్ అక్షింతలు

Webdunia
మంగళవారం, 27 జులై 2021 (15:16 IST)
ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ చేయాల్సిన పని ఏంటో మీకు తెలియదా అని హైకోర్టు మాన్సాస్ ఈవోకు అక్షింతలు వేసింది. మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ అశోక గజపతి రాజు పిటిషన్ పైన హైకోర్టులో  విచారణ ప్రారంభమైంది.
 
ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ తన ఆదేశాలను పాటించడం లేదని అశోకగజపతి పిటిషన్ వేశారు. దీనితో మాన్సాస్ ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పైన హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈఓ పాత్ర ఏమిటి, ఏం చేస్తారో చెప్పాలని నిలదీసింది ఏపీ హైకోర్టు ధర్మాసనం.
 
కోర్టు తీర్పును ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించింది ధర్మాసనం. చైర్మన్ అశోక్ గజపతి రాజు ఆదేశాలను పాటించాల్సిందేనని స్పష్టం చేసింది. చైర్మన్‌కు లేఖ రాసే ముందు కోర్టు తీర్పును ఎందుకు చూడలేకపోతున్నారంటూ హైకోర్టు ప్రశ్నించింది.
 
ఆడిట్ పేరిట ఎవరో వస్తున్నారని హైకోర్టు దృష్టికి సీనియర్ న్యాయవాది సీతారామమూర్తి న్యాయవాది అశ్విన్ కుమార్ తీసుకొచ్చారు. ఆడిట్‌తో ఈవోకు సంబంధం లేదని న్యాయస్థానం స్పష్టం చేసింది. జిల్లా ఆడిట్ అధికారి మాత్రమే ఆడిట్ చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఈవోకు నోటీసులు జారీ చేసిన ఏపీ హైకోర్టు‌ తన విధుల్నిఇక నిర్వహించకపోతే చర్యలు తప్పవని స్పష్టం చేసింది.

సంబంధిత వార్తలు

మేనమామకు మేనల్లుడి అరుదైన బహుమతి... ఏంటది?

OMG (ఓ మాంచి ఘోస్ట్) ట్రైలర్ లో నవ్విస్తూ, భయపెట్టిన నందితా శ్వేత

రాజధాని రౌడీ సినిమాకు థియేటర్స్ నుంచి హిట్ రెస్పాన్స్ వస్తోంది: నిర్మాత

రిలీజ్ కు ముందే ట్రెండ్ అవుతున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల ట్రైలర్

డబుల్ ఇస్మార్ట్ క్లయిమాక్స్ లో రామ్ యాక్షన్ సీన్ హైలెట్ !

మీరు తెలుసుకోవలసిన ప్రతి సాధారణ వాస్కులర్ ప్రొసీజర్‌లు, శస్త్రచికిత్సల గురించి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments