Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాన్సాస్ ట్రస్ట్ ఈవోకు హైకోర్ట్ అక్షింతలు

Webdunia
మంగళవారం, 27 జులై 2021 (15:16 IST)
ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ చేయాల్సిన పని ఏంటో మీకు తెలియదా అని హైకోర్టు మాన్సాస్ ఈవోకు అక్షింతలు వేసింది. మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ అశోక గజపతి రాజు పిటిషన్ పైన హైకోర్టులో  విచారణ ప్రారంభమైంది.
 
ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ తన ఆదేశాలను పాటించడం లేదని అశోకగజపతి పిటిషన్ వేశారు. దీనితో మాన్సాస్ ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పైన హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈఓ పాత్ర ఏమిటి, ఏం చేస్తారో చెప్పాలని నిలదీసింది ఏపీ హైకోర్టు ధర్మాసనం.
 
కోర్టు తీర్పును ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించింది ధర్మాసనం. చైర్మన్ అశోక్ గజపతి రాజు ఆదేశాలను పాటించాల్సిందేనని స్పష్టం చేసింది. చైర్మన్‌కు లేఖ రాసే ముందు కోర్టు తీర్పును ఎందుకు చూడలేకపోతున్నారంటూ హైకోర్టు ప్రశ్నించింది.
 
ఆడిట్ పేరిట ఎవరో వస్తున్నారని హైకోర్టు దృష్టికి సీనియర్ న్యాయవాది సీతారామమూర్తి న్యాయవాది అశ్విన్ కుమార్ తీసుకొచ్చారు. ఆడిట్‌తో ఈవోకు సంబంధం లేదని న్యాయస్థానం స్పష్టం చేసింది. జిల్లా ఆడిట్ అధికారి మాత్రమే ఆడిట్ చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఈవోకు నోటీసులు జారీ చేసిన ఏపీ హైకోర్టు‌ తన విధుల్నిఇక నిర్వహించకపోతే చర్యలు తప్పవని స్పష్టం చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శాపనార్థాలు పెట్టిన రేణూ దేశాయ్.. వారికి చెడు కర్మ ఖచ్చితం... ఎవరికి?

బాలీవుడ్ వైపు మళ్లిన హీరోయిన్.. మృణాల్ ఠాకూర్ వర్సెస్ శ్రీలీల

మా నాన్న కూడా ఇంత ఖర్చు పెట్టి సినిమా తీయలేదు : బడ్డీ మూవీ హీరో అల్లు శిరీష్

ఆది సాయికుమార్ విజువ‌ల్ వండ‌ర్ ష‌ణ్ముఖ షూటింగ్ పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

పచ్చిమిరపకాయలను నానబెట్టిన నీటిని తాగితే?

పిల్లలు, మహిళలు పిస్తా పప్పులు తింటే?

తర్వాతి కథనం
Show comments