Webdunia - Bharat's app for daily news and videos

Install App

దుగ్గిరాల ఎంపీపీ ఉప ఎన్నికలపై హైటెన్షన్

Webdunia
గురువారం, 5 మే 2022 (16:00 IST)
గుంటూరు జిల్లా దుగ్గిరాల ఎంపీపీ ఎన్నికపై హైటెన్షన్ నెలకొంది. ఈ ఎన్నికల్లో ప్రధాన పార్టీలైన తెదేపా, వైకాపా పార్టీల్లో ఉత్కంఠత నెలకొంది. ఇరు పార్టీల తరపున గెలుపొందిన వారిని ప్రలోభాలకు గురికాకుండా కాపాడుకునే ప్రయత్నాల్లో ఇరు పక్షాల నేతలు నిమగ్నమైవున్నారు. ఎంపీపీ సభ్యులందరినీ శిబిరాల్లోకి తరలించారు. ఈ నేపథ్యంలో ఎంపీపీ ఎన్నిక నేపథ్యంలో వీరిని తిరిగి ప్రజాపరిషత్ కార్యాలయానికి చేరుకుంటున్నారు. 
 
వైకాపా ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి (వైకాపా) తరపున 8 మంది ఎంపీటీసీ సభ్యులు ఉన్నారు. కానీ వీరిలో ఐదుగురు మాత్రమే ఎంపీపీ కార్యాలయానికి వచ్చారు. ఇది చర్చనీయాంశంగా మారింది. 
 
వైకాపా రెబెల్ అభ్యర్థి తాడిబోయిన పద్మావతి ఆర్కేతో పాటు హాజరుకాలేదు. ఎంపీపీ పదవికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని ఆమె ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో ఆమెను ఆళ్ళ రామకృష్ణారెడ్డి బుధవారం వైకాపా క్యాంపుకు తరలించారు. దీంతో ఆమె రాకపై ఉత్కంఠత నెలకొంది. 
 
అదేవిధంగా టీడీపీకి చెందిన ఎంపీటీసీలు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ప్రత్యేక బస్సులో దుగ్గిరాల బయలుదేరారు. టీడీపీకి జనసేన పార్టీ ఎంపీటీసీ సాయి చైతన్య కూడా మద్దతు ప్రకటించారు. పైగా, ఎన్నికల సంఘం ఆదేశం మేరకు టీడీపీ, జనసేన పార్టీ సభ్యులకు పోలీసు రక్షణ కల్పించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kalpika Ganesh: నటి కల్పిక మానసిక ఆరోగ్యం క్షీణిస్తోంది.. మందులు వాడట్లేదు: తండ్రి గణేష్ ఫిర్యాదు (video)

OG: పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా నుంచి ఫస్ట్ బ్లాస్ట్ ఇవ్వబోతున్న థమన్

ఊర్వశి రౌతేలాకు షాక్.. లండన్‌లో బ్యాగు చోరీ

Ashwin Babu: వచ్చిన వాడు గౌతమ్ గా అశ్విన్ బాబు రన్నింగ్ లుక్

మయసభ అద్భుతాలు సృష్టించాలని కోరుకుంటున్నాను : సాయి దుర్గ తేజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

Saffron Milk: పిల్లలకు రోజూ కుంకుమ పువ్వు పాలను ఇవ్వవచ్చా?

నార్త్ కరోలినాలో నాట్స్ బాలల సంబరాలు, ఉత్సాహంగా పాల్గొన్న తెలుగు విద్యార్ధులు

తర్వాతి కథనం
Show comments