Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనంతపురం క్లాక్ టవర్ వద్ద ఉద్రిక్తత - వైకాపా వర్సెస్ టీడీపీ

Webdunia
సోమవారం, 6 మార్చి 2023 (18:00 IST)
అనంతపురం జిల్లా కేంద్రంలోని క్లాక్ టవర్ వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అధికార వైకాపా, టీడీపీకి చెందిన కార్యకర్తలు ఒకరిపై ఒకరు సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకుంటూ రాళ్లతో దాడి చేసుకున్నారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. గుంటూరు, కృష్ణా జిల్లాలకు చెందిన టీడీపీ, వైకాపా మద్దతుదారులు సోషల్ మీడియా వేదికగా సవాళ్లు విసురుకున్నారు. దమ్ముంటే రాప్తాడుకు వచ్చి మాట్లాడలని టీడీపీ కార్యకర్త అజయ్ సవాల్ విసిరాడు. దీనికి వైకాపా కార్యకర్త హరికృష్ణారెడ్డి.. ఇదిగో వచ్చాను చూడు.. అంటూ అనంతపురం క్లాక్ టవర్ వద్ద ఓ సెల్ఫీ తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. 
 
దీంతో క్లాక్ టవర్ వద్దకు ఇరు పార్టీల నేతలు చేరుకుని సవాళ్లు, ప్రతి సవాళ్లు విసురుకుని ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ రాళ్ల దాడిలో టీడీపీ కార్యకర్తలకు స్వల్ప గాయాలు అయ్యాయి. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని ఇరు వర్గాల వారిని అదుపులోకి తీసుకుని వాహనాల్లో పోలీస్ స్టేషన్లకు తరలించారు. దీనిపై పోలీసులు స్పందిస్తూ, రాళ్ల దాడిలో ఒక టీడీపీ కార్యకర్తతో పాటు కానిస్టేబుల్‌కు గాయాలు కాగా, వారిని ఆస్పత్రికి తరలించినట్టు చెప్పారు. అలాగే, వీడియోతో ఘర్షణకు రాజేసిన వైకాపా కార్యకర్తను అదుపులోకి తీసుకున్నట్టు చెప్పారు. హరికృష్ణారెడ్డిని ప్రివెంట్ కస్టడీలోకి తీసుకున్నట్టు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments