Webdunia - Bharat's app for daily news and videos

Install App

వివాహేతర సంబంధం పెట్టుకుందని భార్యను చంపి నీటి ట్యాంకులో వేసిన భర్త

Webdunia
సోమవారం, 6 మార్చి 2023 (17:39 IST)
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బిలాస్‌పూర్‌లో ఓ దారుణం జరిగింది. కట్టుకున్న భార్య పరాయి వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందన్న కారణంతో ఓ వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు. కట్టుకున్న భార్యను హత్య చేసి ముక్కలుగా నరికి, శరీర భాగాలను ప్యాక్ చేసి నీటి ట్యాంకులో వేశాడు. బిలాస్‌పూర్‌లోని ఉస్లాపూపర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. గత జనవరి 5వ తేదీన ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఈ ఘాతుకానికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు నకిలీ నోట్ల కేసులో అరెస్టు చేశారు. ఈ కేసును విచారిస్తుండగా భార్యను హత్య చేసిన విషయం వెలుగులోకి వచ్చింది.
 
నకిలీ నోట్ల కేసు విచారణలో భాగంగా, అతని ఇంట్లో పోలీసులు సోదాలు చేస్తుండగా వాటర్ ట్యాంకులో నుంచి దుర్వాసన వచ్చింది. దీన్ని తెరిచి చూడగా, వాటర్ ట్యాంకులో కొన్ని బ్యాగులు కనిపించాయి. వాటిని తెరిచి చూస్తే మృతదేహం ముక్కలు కనిపించడంతో షాక్‍‌కు గురయ్యారు. ఈ మృతదేహం వ్యవహారంపై అతని వద్ద పోలీసులు విచారణ జరుపగా తన భార్య మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందని, అందువల్ల కోపంతో ఈ హత్య చేసినట్టు అంగీకరించాడు. ఈ దంపతులకు పదేళ్ల క్రితం వివాహం కాగా, ఇద్దరు పిల్లులు కూడా ఉన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments