Webdunia - Bharat's app for daily news and videos

Install App

వివాహేతర సంబంధం పెట్టుకుందని భార్యను చంపి నీటి ట్యాంకులో వేసిన భర్త

Webdunia
సోమవారం, 6 మార్చి 2023 (17:39 IST)
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బిలాస్‌పూర్‌లో ఓ దారుణం జరిగింది. కట్టుకున్న భార్య పరాయి వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందన్న కారణంతో ఓ వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు. కట్టుకున్న భార్యను హత్య చేసి ముక్కలుగా నరికి, శరీర భాగాలను ప్యాక్ చేసి నీటి ట్యాంకులో వేశాడు. బిలాస్‌పూర్‌లోని ఉస్లాపూపర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. గత జనవరి 5వ తేదీన ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఈ ఘాతుకానికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు నకిలీ నోట్ల కేసులో అరెస్టు చేశారు. ఈ కేసును విచారిస్తుండగా భార్యను హత్య చేసిన విషయం వెలుగులోకి వచ్చింది.
 
నకిలీ నోట్ల కేసు విచారణలో భాగంగా, అతని ఇంట్లో పోలీసులు సోదాలు చేస్తుండగా వాటర్ ట్యాంకులో నుంచి దుర్వాసన వచ్చింది. దీన్ని తెరిచి చూడగా, వాటర్ ట్యాంకులో కొన్ని బ్యాగులు కనిపించాయి. వాటిని తెరిచి చూస్తే మృతదేహం ముక్కలు కనిపించడంతో షాక్‍‌కు గురయ్యారు. ఈ మృతదేహం వ్యవహారంపై అతని వద్ద పోలీసులు విచారణ జరుపగా తన భార్య మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందని, అందువల్ల కోపంతో ఈ హత్య చేసినట్టు అంగీకరించాడు. ఈ దంపతులకు పదేళ్ల క్రితం వివాహం కాగా, ఇద్దరు పిల్లులు కూడా ఉన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

Comedian Ali: కమెడియన్ అలీ కూడా బెట్టింగ్ యాప్‌‌లో చిక్కుకున్నారా?

Uday Raj: 1990 నాటి టీనేజ్ లవ్ స్టోరీతో మధురం చిత్రం

Aamani : డొక్కా సీతమ్మ తో ఆమని కి అవార్డు రావాలి: మురళీ మోహన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments