Webdunia - Bharat's app for daily news and videos

Install App

అసెంబ్లీ స‌మావేశాల నేప‌థ్యంలో వెల‌గ‌పూడిలో భారీ బందోబ‌స్తు

Webdunia
గురువారం, 18 నవంబరు 2021 (11:03 IST)
వెలగపూడిలోని సచివాలయంలో అసెంబ్లీ సమావేశం జ‌రుగుతున్న దృష్ట్యా సచివాలయ పరిసర ప్రాంతాల్లో గుంటూరు రూర‌ల్ పోలీసులు పటిష్టమైన బందోస్తును ఏర్పాటు చేశారు. రాష్ట్ర గౌరవ అదనపు డిజీపీ రవి శంకర్ అయ్యనార్, ఆధ్వ‌ర్యంలో గుంటూరు రూరల్ ఎస్పీ విశాల్ గున్ని ఈ బందోబ‌స్తును ప‌ర్య‌వేక్షిస్తున్నారు. 
 
 
అసెంబ్లీ సమావేశాల‌కు ముఖ్యమంత్రి, వివిధ శాఖల మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ ప్రభుత్వ శాఖల అధిపతులు హాజరవుతున్న సందర్భంగా అసెంబ్లీ, మండలి సమావేశ ప్రాంగణాలు, సచివాలయ పరిసర ప్రాంతాల్లో పూర్తి పటిష్ఠమైన భద్రత చర్యలు తీసుకున్నామని రూరల్ ఎస్పీ విశాల్ గున్ని తెలిపారు. ఆయ‌న అసెంబ్లీ ప్రాంగణం, స‌చివాలయ పరిసర ప్రాంతాల్లో కలియ తిరిగి బందోబ‌స్తు ఏర్పాట్ల‌ను పరిశీలించారు. బందోబస్తు విధులు నిర్వహిస్తున్న పోలీస్ అధికారులతో మాట్లాడి, అసెంబ్లీ సమావేశము ముగిసే వరకు ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉంటూ, అనుమానాస్ప‌ద వ్య‌క్తుల‌ను గుర్తించాల‌ని, ఎల‌ర్ట్ గా విధులు నిర్వహించాలని పోలీస్ అధికారులను ఆదేశించారు.

 
రాష్ట్రంలో రాజ‌కీయ హీట్ ఎక్కువ‌గా ఉన్న త‌రుణంలో ఈ ప్ర‌త్య‌క ప‌రిస్థితుల్లో ఎటువంటి అవాంఛ‌నీయ సంఘ‌ట‌న‌ల‌కు తావు లేకుండా ఈసారి పోలీసులు ప్ర‌త్యేక చ‌ర్య‌లు తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tanushree Dutta: నా ఇంట్లోనే నన్ను వేధిస్తున్నారు.. ఆరేళ్ల నుంచి ఇదే తంతు

Rasi: ప్రేయసిరావే లో శ్రీకాంత్‌ని కొట్టాను, హిట్‌ అయ్యింది, ఉసురే కూడా అవుతుంది : హీరోయిన్‌ రాశి

Mirai: తేజ సజ్జ, రితికా నాయక్ పోస్టర్ తో మిరాయ్ ఫస్ట్ సింగిల్ రానున్నట్లు ప్రకటన

రతన్ టాటా పెళ్లి చేసుకున్నారా? పెళ్లి అనేది జీవితంలో ఓ భాగం : నిత్యా మీనన్

Suriya: కరుప్పు తో ఇది మన టైం. కుమ్మి పడదొబ్బుతా.. అంటున్న సూర్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తర్వాతి కథనం
Show comments