Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోడికత్తి కేసులో ఎన్.ఐ.ఏ లోతుగా దర్యాప్తు చేయలేదట : హైకోర్టులో నేడు పిటిషన్

Webdunia
శుక్రవారం, 13 అక్టోబరు 2023 (11:02 IST)
విశాఖపట్నం ఎయిర్ పోర్టులో తనపై కోడికత్తితో జరిగిన దాడి కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ లోతుగా దర్యాప్తు చేయలేదని అందువల్ల ఈ కేసులో మళ్లీ లోతుగా దర్యాప్తు చేయాలంటూ ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. దీన్ని విచారణకు స్వీకరించిన హైకోర్టు.. నంబర్‌ను కేటాయించే సమయంలో రిజిస్ట్రీ అభ్యంతరం లేవనెత్తారు. దీంతో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె. శ్రీనివాస్ రెడ్డి నేడు విచారణ చేపట్టనున్నారు.
 
కాగా, కోడికత్తితో తనపై దాడి జరిగిన ఘటనలో కుట్ర కోణం ఉందని సీఎం జగన్ గతంలో ఎన్ఐఏ కోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై లోతైన దర్యాప్తు కోరుతూ పిటిషన్ వేశారు. సాక్షుల విచారణకు షెడ్యూల్ ప్రకటించి, వాంగ్మూలాలు నమోదయ్యే దశలో ఆయన కోర్టును ఆశ్రయించారు. 
 
ఎన్ఐఏ అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోకుండానే అభియోగపత్రం దాఖలు చేసిందని పేర్కొన్నారు. విశాఖ విమానాశ్రయంలోని క్యాంటీన్ నిర్వహకుడు నిందితుడు శ్రీనివాసరావుకు నేర చరిత్ర ఉన్నా పట్టించుకోకుండా విధుల్లోకి తీసుకున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు. అయితే, ఎన్ఐఏ కోర్టు జులై 25న ఈ పిటిషన్ కొట్టేయడంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Anjali : RB చౌదరి నిర్మాతగా విశాల్ 35 చిత్రంలో నటించనున్న అంజలి

కన్నప్ప తరువాత వంద కోట్లతో మైక్రో డ్రామాల్ని సృష్టించనున్న విష్ణు మంచు

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవితో ప్రయోగాలు చేస్తున్న అభిమాన దర్శకులు

రియల్ లవ్ కోరుకునే మిస్టర్ రోమియో టీజర్ లాంచ్ చేసిన శ్రియా శరణ్

Keerthy Suresh: కీర్తి సురేష్ సినిమా మార్కెట్ పడిపోయిందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శక్తినిచ్చే ఖర్జూరం పాలు, మహిళలకు పవర్ బూస్టర్

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

తర్వాతి కథనం
Show comments