Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిక్కుల్లో కేసీఆర్... హైకోర్టు నోటీసు... సీఎం పోస్ట్ ఊడేనా? ఉండేనా?

Webdunia
మంగళవారం, 26 మార్చి 2019 (16:08 IST)
దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యమంత్రుల్లో తెరాస అధినేత కేసీఆర్ దూకుడుగా ముందుకెళుతున్నారు. అటు రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారు. మరోవైపు.. తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్షం అనేది లేకుండా చేస్తూ, తనకు తిరుగులేదని నిరూపిస్తున్నారు. 
 
అలా ముందుకు దూసుకెళుతున్న కేసీఆర్‌కు తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చింది. ఆయనకు నోటీసులు జారీ చేసింది. 2018లో నిర్వహించిన తెలంగాణ అసెంబ్లీ ముందస్తు ఎన్నికల్లో నిబంధనలు ఉల్లంఘించారంటూ పిటిషన్ దాఖలైంది. గజ్వేల్ నియోజకవర్గం నుంచి గెలిచిన కేసీఆర్ ఎన్నికల అఫిడవిట్‌లో తప్పుడు సమాచారం ఇచ్చారని పిటిషన్ దాఖలైంది. 
 
ఆయనపై 64 క్రిమినల్ కేసులు ఉంటే మొదటి అఫిడవిట్‌లో కేవలం 4 కేసులు మాత్రమే చూపారని పిటిషనర్‌ పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు... సీఎం కేసీఆర్‌, ఎన్నికల కమిషన్ సహా 14 మందికి నోటీసులు జారీ చేసింది. విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. ఈ కేసులో గనుక కేసీఆర్‌కు వ్యతిరేకంగా తీర్పు వస్తే మాత్రం ఆయన సీఎం పదవి నుంచి తప్పుకోవాల్సి ఉంటుంది. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments