Webdunia - Bharat's app for daily news and videos

Install App

డిజైనింగ్ - రీటెండరింగ్ పేరుతో ప్రజాధనం కొల్లగొట్టేస్తున్న సీఎంలు : శివాజీ

Webdunia
గురువారం, 3 అక్టోబరు 2019 (11:40 IST)
మెఘా అధినేత కృష్ణారెడ్డితో పాటు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులపై సినీ నటుడు శివాజీ సంచలన ఆరోపణలు చేశారు. డిజైనింగ్, రీటెండరింగ్ పేరుతో ప్రజాధనం దోచుకుంటున్నారని ఆరోపించారు. దీనికి సంబంధించి ఆధారాలను త్వరలోనే వెల్లడిస్తానని ప్రకటించారు. 
 
ఇదే అంశంపై ఆయన గురువారం మాట్లాడుతూ, మేఘా ఇంజినీరింగ్ సంస్థ అధినేత కృష్ణారెడ్డితో పాటు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్‌లపై సంచలన ఆరోపణలు చేశారు. కృష్ణారెడ్డి మిత్రద్రోహి అంటూ మండిపడ్డారు. ఆయన అక్రమాలకు సంబంధించిన నిజాలను ఆధారాలతో సహా బయటపెడతానని చెప్పారు. 
 
ఈ విషయాలను మీడియా ద్వారా బయటపెడదామని తాను అనుకున్నానని... అయితే వాటిని ప్రసారం చేసే దమ్ము దేశంలోని ఏ మీడియాకు లేదని తెలిపారు. ప్రాజెక్టుల పేరుతో ప్రజాధనాన్ని దోచుకుని, వాటిని ముఖ్యమంత్రులతో పంచుకోవడం దేశద్రోహమని అన్నారు. 
 
ముఖ్యంగా, ప్రాజెక్టుల రీడిజైనింగ్, రీటెండరింగ్ పేరుతో సీఎంలు, కాంట్రాక్టర్లు ప్రజాధనాన్ని దోచుకోవడం దారుణమని చెప్పారు. ప్రభుత్వాలు ఇచ్చే సబ్సిడీతో బస్సులను కొని, వాటి ద్వారా వచ్చే ఆదాయాన్ని జేబుల్లోకి వేసుకోవడం అతి పెద్ద నేరమని అన్నారు.
 
ఓఎన్జీసీలో 27 రిగ్గుల కాంట్రాక్టును దక్కించుకుని ప్రజాధనాన్ని లూఠీ చేసిన దేశద్రోహి గురించి చెప్పాలనుకుంటున్నానని... దేశానికి ముప్పుగా పరిణమించిన ఆ ద్రోహి మేఘా కృష్ణారెడ్డి అని శివాజీ మండిపడ్డారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments