Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తమిళ చిత్ర పరిశ్రమకే ఎక్కువ మార్కులు వేస్తాను : హీరోయిన్ లైలా

తమిళ చిత్ర పరిశ్రమకే ఎక్కువ మార్కులు వేస్తాను : హీరోయిన్ లైలా
, మంగళవారం, 24 సెప్టెంబరు 2019 (13:25 IST)
తెలుగు వెండితెరకు పరిచయమైన అందమైన హీరోయిన్లలో ఒకరు లైలా. 'ఎగిరే పావురమా' చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైంది. ఆ తర్వాత దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి హీరోగా నటించిన 'ఉగాది' చిత్రంలో ఆయన సరసన హీరోయిన్‌గా నటించింది. ఆ పిమ్మట 'ఖైదీగారు', 'పెళ్లిచేసుకుందాం', 'పవిత్రప్రేమ' వంటి సినిమాలు చేసింది. అలాగే, తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో దాదాపు 50కి పైగా చిత్రాల్లో నటించింది. ఆ తర్వాత ఆమె పెళ్లి చేసుకుని వెండితెరకు దూరమైంది. 
 
ఈ పరిస్థితుల్లో హాస్య నటుడు ఆలీ వ్యాఖ్యాతగా ప్రసారమయ్యే 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడింది. ఇందులో మాట్లాడుతూ, తెలుగు చిత్రపరిశ్రమ అంటే నాకు చాలా ఇష్టం. ఆ తర్వాత నేను తమిళ చిత్రపరిశ్రమకి ఎక్కువ మార్కులు ఇస్తాను. ఈ రెండు భాషల్లోను నాకు మంచి ప్రోత్సాహం లభించింది. 
 
అందువల్లనే త్వరలో ఈ రెండు భాషల్లో రీఎంట్రీ ఇవ్వనున్నాను. తెలుగు.. తమిళ భాషల్లో రూపొందే ఒక సినిమాతో నా రెండో ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టనున్నాను. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. గతంలో పనిచేయలేకపోయిన దర్శకులతోను కలిసి పనిచేయాలని వుంది' అని లైలా చెప్పుకొచ్చింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వెంకీమామ‌కి రెండు క్లైమాక్స్‌లు షూట్ చేస్తున్నారా..?