Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు - రేపు భారీ వర్షాలు - చిత్తూరు జిల్లాల్లో స్కూల్స్ సెలవు

Webdunia
శనివారం, 27 నవంబరు 2021 (12:30 IST)
శ్రీలంక - తమిళనాడులకు మధ్య ఏర్పడిన అల్పపీడన ప్రభావం కారణంగా ఏపీలోని రాయలసీమ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తర తమిళనాడులకు సమీపంలో ఉన్న చిత్తూరులో ఈ వర్ష ప్రభావం అధికంగా వుంది. దీంతో ఆ జిల్లాలో విద్యా సంస్థలకు శనివారం సెలవు ప్రకటించారు. 
 
ఇదిలావుంటే, బంగాళాఖాతంలో అండమాన్ దీవులకు దక్షిణంగా ఈ నెల 29వ తేదీన అల్పపీడనం ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఇది క్రమంగా బలపడి పశ్చి, వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉన్నట్టు సమాచారం. 
 
దీంతో తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల్లోని కొన్ని జిల్లాల్లో శని, ఆదివారాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని అమరావతి, హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. 
 
మరోవైపు, ఈశాన్య భారతం నుంచి తెలంగాణా వైపు తక్కువ ఎత్తులో గాలులు వస్తుండటంతో నేడు, రేపు తెలంగాణాలో ఓ మోస్తరు, రాయలసీమ, దక్షిణ కోస్తాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆ హీరో కళ్లలో గమ్మత్తైన ఆకర్షణ ఉంది : షాలిని పాండే

సిలికాన్‌లో ఏఐ రీసెర్చ్ సెంటర్‌ లో సీఈఓ అరవింద్ శ్రీనివాస్‌ను కలిసిన కమల్ హాసన్

జై శ్రీరామ్ అంటూ తన్మయంతో డాన్స్ చేసిన మెగాస్టార్ చిరంజీవి

Indraganti: సారంగపాణి జాతకం చూసేందుకు డేట్ ఫిక్స్ చేసిన నిర్మాత

వేర్వేరు లక్ష్యాలతో ఉన్నఇద్దరి ప్రేమ కథతో డియర్ ఉమ విడుదలకు సిద్ధమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments