Webdunia - Bharat's app for daily news and videos

Install App

నెల్లూరులో భారీ వర్షాలు.. స్తంభించిన జనజీవనం- 9 గొర్రెలు మృతి

సెల్వి
బుధవారం, 13 నవంబరు 2024 (11:18 IST)
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా మంగళవారం నగరంతోపాటు నెల్లూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో జనజీవనం స్తంభించింది. 
 
వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం దగదర్తి మండలంలో అత్యధికంగా 82.88 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, సంగం మండలంలో 45.80 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. వాతావరణ శాఖ నుండి వర్షపాతం హెచ్చరికను అనుసరించి, మొత్తం 19 మండలాల్లో ముఖ్యంగా తీర ప్రాంతాలలో అధికారులు, సిబ్బందిని ప్రభుత్వం అప్రమత్తం చేసింది. 
 
మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కావలి రూరల్ మండలం తుమ్మలపెంట గ్రామంలో పిడుగుపడి 9 గొర్రెలు మృతి చెందగా, అక్కంపేట-మనుబోలు మధ్య వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. 
 
ఈదురు గాలులు, అలలతో సముద్రం అల్లకల్లోలంగా మారడంతో కావలి, ఇందుకూరుపేట, అల్లూరు, టిపి గూడూరు, విడవలూరు, కొడవలూరు, రామాయపట్నం, కోడూరు, ముత్తుకూరు వంటి 9 తీరప్రాంత మండలాల్లోని 100 గ్రామాల్లో హై అలర్ట్‌ ప్రకటించారు. 
 
సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని జిల్లా యంత్రాంగం హెచ్చరించింది. వర్షాల కారణంగా సోమశిల జలాశయంలో నీటిమట్టం పెరిగింది. మరో రెండు రోజుల పాటు జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

చిత్రపురి కాలనీ స్థలం ఉచితంగా రాలేదు.. ఆరోపణలు చేసే వారికి ఏం తెలుసు?

FISM 2025: సుహానీ షా రికార్డ్: ఉత్తమ మ్యాజిక్ క్రియేటర్ అవార్డు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments