Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మో.. ఈ ఏడాది భానుడి ప్రతాపం మామూలుగా వుండదట..

Webdunia
శుక్రవారం, 5 మార్చి 2021 (20:46 IST)
తెలుగు రాష్ట్రాల్లో భానుడి ప్రతాపం అధికంగా ఉంటుందని, సాధారణంగా వేసవిలో నమోదయ్యే సగటు ఉష్ణోగ్రతలతో పోలిస్తే, ఈ సంవత్సరం మరింత వేడిమిని భరించాల్సి వుంటుందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. 
 
ఈ విషయంలో ప్రజలు తగు జాగత్తలు తీసుకోవాలని కోరింది. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లతో పాటు తమిళనాడు, కర్ణాటకల్లో వేడిమి అధికంగా ఉంటుందని, రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. 
 
సాధారణ పరిస్థితుల్లో ఉదయం నుంచి పెరిగే ఎండలు సాయంత్రానికి కాస్తంత ఉపశమనాన్ని ఇస్తాయని, కానీ ఈ సంవత్సరం సాయంత్రంలోనూ తీవ్రమైన ఉక్కపోతను అనుభవించాల్సి వుంటుందని, వేసవి వేడిమి 42 డిగ్రీల సెల్సీయస్ వరకూ చేరవచ్చని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments