Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీకాకుళం రణస్థలి వేదికగా జనసేన 'యువశక్తి' సభ

Webdunia
గురువారం, 12 జనవరి 2023 (11:42 IST)
శ్రీకాకుళం జిల్లాలోని రణస్థలి వేదికగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో యువశక్తి పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని ఈ యువసభను జరుపుతున్నారు. ఇందులో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొని ప్రసంగిస్తారు. ఇందుకోసం జిల్లాలోని లావేరు మండలం తాళ్ళవలస సమీపంలో 25 ఎకరాల్లో భారీ ప్రాంగణంలో వేదికను సిద్ధం చేశారు. అలాగే వేదికపై పవన్‌‍తో పాటు వంది మంది ప్రతినిధులు కూర్చునేలా ఏర్పాట్లుచేశారు. ఇందుకోసం పవన్ కళ్యాణ్ ఇప్పటికే విజయనగరం జిల్లా భోగాపురం మండలంలోని సన్ రే రిసార్ట్స్‌కు చేరుకున్నారు. 
 
ఈ యువశక్తి సభ మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు జరుగుతుంది. ఇందులో వంది మంది యువకులు ప్రసంగిస్తారు. సభ ముగింపు సందర్భంగా పవన్ కళ్యాణ్ కీలక ప్రసంగం చేస్తారు. ముఖ్యంగా, రెండు రాజకీయ తీర్మానాలు చేస్తారు. అలాగే, టీడీపీ జనసేన పార్టీల మధ్య వచ్చే ఎన్నికల్లో పొత్తు ఖాయమనే వార్తలు వస్తున్నాయి. దీంతో వైకాపా నేతలు విపక్ష నేతలను కట్టడి చేసేందుకు బ్రిటీష్ కాలం నాటి చట్టాన్ని తెరపైకి తెచ్చి జీవో నంబర్ 1ని విడుదల చేసింది.
 
అలాగే, స్వామి వివేకానంద జయంతి సందర్భంగా యువతకు పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. మన జాతి భవిష్యత్ మీదే.. జైహింద్ అంటూ ట్వీట్ చేశారు. "నీలో సాహసం ఉంటే దేశం అంధకారంలో ఉంటుందా? అని రాసివున్న పోస్టరును ట్విట్టర్‌లో ఆయన షేర్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దిల్ రాజు కాదు... రన్నింగ్ రాజు : అనిల్ రావిపూడి (Video)

పారితోషికం కంటే పనిలో సంతృప్తి కి ప్రాధాన్యత: కిషోర్ బొయిదాపు

Nitin: సోదరి సెంటిమెంట్ తమ్ముడు మూవీకి ఎ సర్టిఫికెట్ కావాలన్న దిల్ రాజు

అప్పుడు బొమ్మరిల్లు ఇప్పుడు 3 BHK, అందుకే కె విశ్వనాథ్ గారికి అంకితం: సిద్ధార్థ్

ఆలయానికి మరో ఏనుగును విరాళంగా ఇచ్చిన నటి త్రిష

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments