Webdunia - Bharat's app for daily news and videos

Install App

వంశోద్ధారకుడి కోసం చావని ఆశ... ప్రాణం తీసిన ప్రసవం

Webdunia
బుధవారం, 21 నవంబరు 2018 (14:25 IST)
ఓ మాతృమూర్తి ఆశ అడియాశలై పోయింది. వంశోద్ధారకుడు ఉంటేనే పున్నామనరకం నుంచి తప్పిస్తాడనే వెర్రి ఆశ ఓ మాతృమూర్తి ప్రాణం తీసింది. ఫలితంగా ఆరుగురు ఆడబిడ్డలు అనాథలుగా మారారు. 
 
ఒకరిద్దరూ బిడ్డలను పెంచి పోషించేందుకే అష్టకష్టాలు పడుతున్న ఈ రోజుల్లో మగపిల్లాడు పుట్టాలనే ఆశతో ఐదుగురు ఆడపిల్లలకు జన్మనిచ్చింది ఓ తల్లి. ఈ ఆరు కాన్పులతో ఆమె శక్తి హరించుకునిపోయింది. అయినప్పటికీ.. వంశోద్ధారకుడు కోసం ఆశ చావని ఆ తల్లి ఆరో కాన్పులోనైనా పుడతాడని ఆశపడింది. అయితే, అదే ఆమెకు చివరి కాన్పు అవుతుందని ఊహించలేక పోయింది. మరో ఆడబిడ్డకు జన్మనిచ్చి అసువులు బాసింది. ఈ విషాదకర ఘటన గుంటూరు జిల్లా గురజాలలో జరిగింది. 
 
స్థానిక దళితవాడకు చెందిన చిలుకూరి మేరీ సునీత అనే 26 యేళ్ళ మహిళ కూలీనాలి చేసుకుంటూ జీవిస్తోంది. ఈమె భర్త రిక్షాకార్మికుడు. వీరికి పదేళ్ళ క్రితం వివాహం కాగా ఐదుగురు ఆడపిల్లలు ఉన్నారు. కానీ వంశోద్ధారకుడుకి కోసం ఆ దంపతులు పరితపించారు. తనలోని శక్తి హరించుకుని పోయినా ఆ తల్లి ఆరో కాన్పుకు సిద్ధపడింది. కానీ అదే చివరి కాన్పు అవుతుందని ఆమె గ్రహించలేక పోయింది. ఆరో కాన్పులో మరో ఆడబిడ్డకు జన్మనిచ్చిన మేరీ సునీత కన్నుమూసింది. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments