Webdunia - Bharat's app for daily news and videos

Install App

వంశోద్ధారకుడి కోసం చావని ఆశ... ప్రాణం తీసిన ప్రసవం

Webdunia
బుధవారం, 21 నవంబరు 2018 (14:25 IST)
ఓ మాతృమూర్తి ఆశ అడియాశలై పోయింది. వంశోద్ధారకుడు ఉంటేనే పున్నామనరకం నుంచి తప్పిస్తాడనే వెర్రి ఆశ ఓ మాతృమూర్తి ప్రాణం తీసింది. ఫలితంగా ఆరుగురు ఆడబిడ్డలు అనాథలుగా మారారు. 
 
ఒకరిద్దరూ బిడ్డలను పెంచి పోషించేందుకే అష్టకష్టాలు పడుతున్న ఈ రోజుల్లో మగపిల్లాడు పుట్టాలనే ఆశతో ఐదుగురు ఆడపిల్లలకు జన్మనిచ్చింది ఓ తల్లి. ఈ ఆరు కాన్పులతో ఆమె శక్తి హరించుకునిపోయింది. అయినప్పటికీ.. వంశోద్ధారకుడు కోసం ఆశ చావని ఆ తల్లి ఆరో కాన్పులోనైనా పుడతాడని ఆశపడింది. అయితే, అదే ఆమెకు చివరి కాన్పు అవుతుందని ఊహించలేక పోయింది. మరో ఆడబిడ్డకు జన్మనిచ్చి అసువులు బాసింది. ఈ విషాదకర ఘటన గుంటూరు జిల్లా గురజాలలో జరిగింది. 
 
స్థానిక దళితవాడకు చెందిన చిలుకూరి మేరీ సునీత అనే 26 యేళ్ళ మహిళ కూలీనాలి చేసుకుంటూ జీవిస్తోంది. ఈమె భర్త రిక్షాకార్మికుడు. వీరికి పదేళ్ళ క్రితం వివాహం కాగా ఐదుగురు ఆడపిల్లలు ఉన్నారు. కానీ వంశోద్ధారకుడుకి కోసం ఆ దంపతులు పరితపించారు. తనలోని శక్తి హరించుకుని పోయినా ఆ తల్లి ఆరో కాన్పుకు సిద్ధపడింది. కానీ అదే చివరి కాన్పు అవుతుందని ఆమె గ్రహించలేక పోయింది. ఆరో కాన్పులో మరో ఆడబిడ్డకు జన్మనిచ్చిన మేరీ సునీత కన్నుమూసింది. 

సంబంధిత వార్తలు

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments