Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్నారై ఉయ్యూరు శ్రీనివాసరావు అరెస్టు.. సొంత పూచీకత్తుపై విడుదల

Webdunia
మంగళవారం, 3 జనవరి 2023 (08:45 IST)
ఉయ్యూరు చారిటబుల్ ట్రస్ట్ అధినేత, ఎన్నారై ఉయ్యూరు శ్రీనివాస రావును గుంటూరు జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత ఆయన్ను కోర్టులో హాజరుపరచగా, వ్యక్తిగత పూచీకత్తుపై కోర్టు ఆయనను విడుదల చేసింది. ఈ కేసు విచారణకు పూర్తిగా సహకరించాల్సిందిగా న్యాయమూర్తి ఆదేశించారు.
 
ఆదివారం గుంటూరులో ఉయ్యూరు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నగారి జనతా వస్త్రాలు, చందన్న కానుకల పంపిణీ చేపట్టింది. ఈ కార్యక్రమానికి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు హాజరై ప్రసంగించి వెళ్లిపోయారు. ఆ తర్వాత జరిగిన తొక్కిసలాటలో ముగ్గురు మహిళలు ప్రాణాలు కోల్పోగా, మరొకరు గాయపడ్డారు. దీంతో గుంటూరు పోలీసులు ఆయనపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. పలు సెక్షన్లు నమోదు చేశారు. 
 
ఆ తర్వాత ఆయన్ను స్థానిక కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. అయితే, శ్రీనివాస్‌కు రిమాండ్ విధించేందుకు న్యాయమూర్తి నిరాకరించారు. ఘటనతో సంబంధం లేని సెక్షన్ చేర్చడంతో 304(2) నుంచి శ్రీనివాస్‌కు మినహాయింపు లభించింది. ఆ తర్వాత రూ.25 వేల పూచీకత్తుపై ఆయన్ను విడుదల చేశారు. పోలీసుల విచారణకు సహకరించాలని ఈ సందర్భంగా శ్రీనివాస్‌ను న్యాయమూర్తి ఆదేశించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏమీ ఇవ్వలేనన్నారు, ఐతే ఈసారికి ఫ్రీ అన్నాను: నటి ప్రియాంకా జవల్కర్

Pawan: వేసవిలో విడుదలకు సిద్ధమవుతోన్న పవన్ కళ్యాణ్ చిత్రం హరి హర వీరమల్లు

Vishnu: విష్ణు వల్లే గొడవలు మొదలయ్యాయి - కన్నప్ప వర్సెస్ భైరవం : మంచు మనోజ్

ప్రదీప్ మాచిరాజు చిత్రం అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి రివ్యూ

రాజేంద్ర ప్రసాద్ అన్నయ్య షష్టి పూర్తి చూడండి, బావుంటుంది : రవితేజ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం