Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుంటూరు రోడ్లు, డ్రైనేజీ వ్య‌వ‌స్థ‌లో పెనుమార్పులు: హోం మంత్రి సుచ‌రిత‌

Webdunia
శనివారం, 31 జులై 2021 (11:47 IST)
గుంటూరు న‌గ‌రంలోని రోడ్లు, డ్రైనేజీ వ్య‌వ‌స్థ‌ల్లో పెను మార్పులు రాబోతున్నాయ‌ని ఏపీ హోం మంత్రి సుచ‌రిత చెప్పారు. గుంటూరు లోని పట్టాభిపురం నుంచి శ్యామల నగర్ వరకు కొత్త‌గా నిర్మించిన సీసీ రోడ్‌ను హోంమంత్రి మేకతోటి సుచరిత  ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే మద్దాలి గిరిధర రావు, ఎమ్మెల్సీలు కల్పలతా రెడ్డి, లక్ష్మణరావు, మేయర్ కావటి శివనాగ మనోహర్ నాయుడు, కమిషనర్ అనురాధ, చంద్రగిరి ఏసురత్నం, డిప్యూటీ మేయర్ షేక్ సజీలా, ఇతర వైస్సార్సీపీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు. కొత్త‌గా నిర్మించిన సీసీ రోడ్డు కు ఇరువైపులా హోంమంత్రి సుచరిత మొక్కలను నాటారు. నాయకులు, అధికారులతో కలిసి సిసి రోడ్ ను పరిశీలించారు.

గత ప్రభుత్వం హయాంలో గుంటూరు నగరంలో రోడ్ల పరిస్థితి దారుణంగా ఉండేదని, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నగరాల్లో అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నారని సుచ‌రిత అన్నారు. గుంటూరు నగరంలో రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థలో పెనుమార్పులు వస్తున్నాయ‌ని, తడి చెత్త, పొడి చెత్త, చెట్ల ను నాటడం లాంటి కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయన్నారు. రానున్న రోజుల్లో నగర అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని హోంమంత్రి అన్నారు.

సంబంధిత వార్తలు

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments