Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రొయ్యల చెరువు వద్ద ఘోరం : ఆరుగురి వ్యక్తుల సజీవదహనం

రొయ్యల చెరువు వద్ద ఘోరం : ఆరుగురి వ్యక్తుల సజీవదహనం
, శుక్రవారం, 30 జులై 2021 (09:05 IST)
గుంటూరు జిల్లాలో దారుణం జరిగింది. జిల్లాలోని రేపల్లె మండలం లంకెవానిదిబ్బలోని ఓ రొయ్యల చెరువు వద్ద కాపలాగా ఉన్న ఆరుగురు వ్యక్తులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. మృతులను ఒడిశాకు చెందిన కూలీలుగా గుర్తించారు. 
 
ఈ సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రాత్రివేళ విద్యుదాఘాతం కారణంగానే ఈ ఘటన జరిగి ఉంటుందని చెబుతుండగా, విద్యుత్ అధికారులు మాత్రం వారి మరణానికి షార్ట్‌సర్క్యూట్ ఎంతమాత్రమూ కారణం కాదని చెప్పడం అనేక అనుమానాలు రేకెత్తిస్తుంది.
 
మరోవైపు, ఘటనా స్థలం వద్దకు మీడియాను అనుమతించడం లేదు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆగస్టు 16 నుంచి తెరుచుకోనున్న స్కూల్స్!