Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎస్పీ బాలును అగౌరవపరచాలన్న ఉద్దేశ్యం కాదు : గుంటూరు కమిషనర్

Webdunia
మంగళవారం, 4 అక్టోబరు 2022 (19:31 IST)
గాన గంధర్వుడు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యంను అగౌరవపరచాలన్న ఉద్దేశ్యంతో ఆయన విగ్రహాన్ని తొలగించలేదని గుంటూరు నగర పాలక సంస్థ కమిషనర్ చేకూరి కీర్తి అన్నారు. 
 
గుంటూరులో ఎస్పీబీ అభిమానులు ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. నగరంలోని మదర్ థెరీస్సా జంక్షన్‌లో ఈ విగ్రహాన్ని ప్రతిష్టించారు. అయితే, ఈ కూడలి రద్దీ ప్రాంతంగా పేర్కొంటూ ఎస్పీబీ విగ్రహాన్ని పోలీసుల అండతో నగర పాలక సంస్థ అధికారులు తొలగించారు. 
 
దీంతో కార్పొరేషన్‌ అధికారులపై కళాకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వివాదంపై గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్‌ చేకూరి కీర్తి స్పందించారు. 'నగరంలో ఎస్పీ బాలు విగ్రహం ఏర్పాటుపై అపోహలు వచ్చాయి. 2021 జూన్‌ 5న నాజ్‌ సెంటర్లో బాలు విగ్రహం ఏర్పాటుకు కార్పొరేషన్‌ అనుమతిచ్చిందని తెలిపారు. 
 
అయితే, అనుమతించిన ప్రదేశంలోకాకుండా మదర్‌ థెరీసా సెంటర్‌లో విగ్రహం పెట్టారు. అనుమతిలేని చోట విగ్రహం ఏర్పాటు చేయడంతో తొలగించాం. నాజ్‌ సెంటర్‌లో విగ్రహం ఏర్పాటు చేసుకోవచ్చని కళా దర్బార్‌ వారికి చెప్పాం. బాలు గారిని అగౌరవపర్చాలని విగ్రహం తొలగించలేదు. అనుమతిచ్చిన ప్రాంతంలోనే విగ్రహం ఏర్పాటు చేసుకోవాలి అని సూచించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

దక్షిణాదిలో గుడికట్టాలంటూ డిమాండ్ చేస్తున్న బాలీవుడ్ హీరోయిన్! (Video)

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments