Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రేవ్ పార్టీలో చిక్కిన టెక్కీలను తొలగించిన టాప్ ఐటీ కంపెనీలు

raveparty
, గురువారం, 7 ఏప్రియల్ 2022 (12:53 IST)
హైదరాబాద్ నగరంలోని రాడిసన్ బ్లూ ప్లాజాలోని ఫుడింగ్ అండ్ మింకీ జరిగిన రేవ్ పార్టీలో అనేక మంది సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు పాల్గొన్నట్టు తేలింది. దీంతో ఈ రేవ్ పార్టీతో సంబంధం ఉన్న వారినీ ఆయా కంపెనీలు తొలగిస్తున్నాయి. 
 
ఇటీవల జూబ్లీ హిల్స్ పోలీసులు ఈ పబ్‌పై సోదాలు చేసిన విషయం తెల్సిందే. ఆ సమయంలో అనేక మంది సినీ రాజకీయ ప్రముఖుల పిల్లలు పట్టుబడ్డారు. వీరిపై ఎలాంటి కేసులు నమోదు చేయకుండా నోటీసులు ఇచ్చి పంపించారు. 
 
అలాగే, రాడిసన్ బ్లూ ప్లాజా హోటల్ లైసెన్సును కూడా రద్దు చేసింది. అదేసమయంలో ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు లోతుగా దర్యాప్తు జరుపుతున్నారు. 
 
మరోవైపు, ఐటీ కంపెనీలు కూడా తమ ఉద్యోగులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. డ్రగ్స్ తీసుకుంటున్న ఉద్యోగులపై కఠిన చర్యలకు ఉపక్రమించాయి. మత్తు పదార్థాలకు బానిసలైన ఉద్యోగులపై వేటు వేశాయి. తాజాగా 13 మంది ఐటీ ఉద్యోగులను ఐటీ కంపెనీలు తొలగించాయి. మరో 50 మంది ఉద్యోగులకు నోటీసులు ఇచ్చాయి. 
 
పైగా, పోలీసులకు పట్టుబడిన డ్రగ్స్ పెడ్లర్ల వద్ద ఐటీ ఉద్యోగుల జాబితా ఉంది. దీంతో వీరి పేర్లు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. డ్రగ్స్ వాడిన ఇన్ఫోసిస్, మైక్రోసాఫ్ట్, మహీంద్రా క్యూసాఫ్ట్ ఉద్యోగులకు పోలీసులు పట్టుకున్నారు. డ్రగ్ ఫెడ్లర్ టోనీ, ప్రేమ్ కుమార్, లక్ష్మీపతిల వద్ద డ్రగ్స్ కొనుగోలు చేసినట్టు వెల్లడైంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీలో కొత్త జిల్లాల్లో 75 శాతానికి పెరిగిన భూముల మార్కెట్ విలువ