Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుంటూరు జిల్లాలో బాలికపై ఇద్దరు కామాంధుల అత్యాచారం

Webdunia
బుధవారం, 31 ఆగస్టు 2022 (11:13 IST)
గుంటూరు జిల్లా పట్టాభిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ బాలికపై ఇద్దరు కామాంధులు అత్యాచారానికి పాల్పడ్డారు. నాలుగు రోజుల క్రితం జరిగిన ఈ అత్యాచార ఘటన తాజా వెలుగులోకి వచ్చాయి. పోలీసుల కథనం మేరకు.. ఆగస్టు 27వ తేదీన 14 యేళ్ల బాలిక రాత్రి 7 గంటల సమయంలో ఇంటి బయటకు వెళ్లి ఆ తర్వాత మళ్లీ ఇంటికి తిరిగిరాలేదు. 
 
దీంతో ఆమె తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో తొలుత పోలీసులు మిస్సింగ్ కేసుగా నమోదు చేశారు. దర్యాప్తు చేపట్టి ఆ బాలిక ఆచూకీని తెలుసుకున్నారు. ఆ బాలికను నాని అనే యువకుడు అత్యాచారం చేసినట్టు పోలీసులు గుర్తించారు. 27వ తేదీన బాలికను తన ద్విచక్రవాహనంపై ఎక్కించుకుని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లిన నాని అక్కడ బలవంతంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. 
 
ఆ తర్వాత ఆ బాలికను ఇంటి సమీపంలో రాత్రిపూట వదిలి వెళ్లిపోయాడు. అక్కడ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఆ బాలికను చేరదీసి అత్యాచారానికి పాల్పడినట్టు బాధితురాలి వద్ద పోలీసులు జరిపిన విచారణలో వెల్లడించింది. దీంతో నాని, జగన్మోహన్ రెడ్డిలపై పోలీసులు కేసు నమోదు చేసి పరారీలో ఉన్న వారి కోసం గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కాంతారా-2 షూటింగ్‌లో విషాదం- ముగ్గురు ఆర్టిస్టులు కన్నుమూత

ప్రిజం పబ్‌లో గొడవ : నటి కల్పిక గణేశ్‌పై కేసు

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments