Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుంటూరులో వైద్యం వికటించి చిన్నారి మృతి

Webdunia
శనివారం, 14 మే 2022 (13:52 IST)
గుంటూరులో వైద్యం వికటించి చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. జీజీహెచ్ వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఆరాధ్య అనే చిన్నారి ప్రాణాలు కోల్పోయింది.

కంటి కురుపునకు చికిత్స కోసం నాలుగు రోజులు క్రితం చిన్నారి జీజీహెచ్‌లో చేరింది. శస్త్ర చికిత్స అనంతరం ఆరాధ్యను వైద్యులు వెంటిలేటర్‌పై ఉంచారు. వైద్యం వికటించి వెంటిలేటర్‌పైకి చేరినట్లు తల్లిదండ్రులు ఆరోపించారు. 
 
కాగా… చిన్నారి పరిస్థితి మరింత విషమంగా ఉండటంతో నాలుగు రోజుల క్రితం జీజీహెచ్ నుంచి రమేష్ ఆసుపత్రికి తరలించారు. రమేష్ ఆసుపత్రిలో కూడా ఆరాధ్య వెంటిలేటర్‌కే పరిమితమైంది. పరిస్థితి విషమించడంతో కొద్దిసేపటి క్రితమే చిన్నారి చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు.
 
నగర శివారు అంకిరెడ్డిపాలానికి చెందిన ఏడుకొండలు, పావని దంపతుల కుమార్తె ఆరాధ్య. 12 ఏళ్ల పాపకు కంటి కింద చిన్న కణితి ఏర్పడింది. 
 
చిన్నారి ఎదుగుతున్న కొద్ది కణితి ఇబ్బందికరంగా మారుతుందని భావించిన తల్లిదండ్రులు… దానిని తొలగించేందుకు జీజీహెచ్‌ వైద్యులను సంప్రదించారు. అక్కడ ఆపరేషన్‌కు వెళ్లిన చిన్నారి.. ఆపరేషన్‌కు తర్వాత తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రతీ అమ్మాయి విజయం వెనుక ఓ అబ్బాయీ ఉంటాడు : డియర్ ఉమ సుమయ రెడ్డి

ఎన్టీఆర్, హృతిక్ నటించిన వార్-2 మొదటి మోషన్ పోస్టర్ మే లో రాబోతోంది

తారక్ అద్భుతమైన నటుడు : ఎస్ఎస్ రాజమౌళి

Madhuram: తినడం మానేసి కొన్ని రోజులు నీళ్లు మాత్రమే తాగాను : ఉదయ్ రాజ్

డా. చంద్ర ఓబులరెడ్డి ఆవిష్కరించిన ఏ ఎల్ సీ సీ. ట్రెయిలర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments