Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్నేహితురాలిని బ్లాక్ మెయిల్ చేసి అత్యాచారం... ఎక్కడ?

Webdunia
ఆదివారం, 28 జూన్ 2020 (10:37 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరులో దారుణం జరిగింది. తోటి స్నేహితురాలిని బ్లాక్ మెయిల్ చేసి అత్యాచారం చేసిన ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. బాధితురాలు ఇంజనీరింగ్ విద్యను అభ్యసిస్తూ వస్తోంది. ఈ క్రమంలో ఆమెను నగ్నంగా ఫోటోలు, వీడియోలు చిత్రీకరించి, ఆపై బ్లాక్ మెయిల్ చేసి అత్యాచారానికి ఒడిగట్టారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, గుంటూరుకు చెందిన ఓ యువతి మూడేళ్ల కిందట ఓ ఇంజనీరింగ్‌ కాలేజీలో చదువుతున్న సమయంలో అదే కళాశాలకు చదువుతున్న యువకుడితో పరిచయం అయింది. ఈ క్రమంలో ఆ యువకుడు మత్తుమందు కలిపిన శీతలపానీయం తాగించి ఆమెను లొంగదీసుకుని నగ్నదృశ్యాలు, వీడియో చిత్రీకరించాడు. 
 
ఆ వీడియోలను అడ్డుపెట్టుకొని ఆమెను బ్లాక్‌మెయిల్‌ చేయడంతో ఆమె అతనికి దూరమైంది. తర్వాత ఆమె మరో యువకుడితో సన్నిహితంగా ఉండసాగింది. ఆ యువకుడి వద్దకూ స్నేహితుల ద్వారా ఆమె నగ్న చిత్రాలు, వీడియోలు చేరాయి. అతను వాటిని అంతర్జాలంలో పోస్టు చేసి, తర్వాత తొలగించాడు. 
 
ఈ విషయం తెలుసుకున్న యువతి కుటుంబసభ్యులు పరువుపోతుందనే భయంతో ఇద్దరు యువకులను సంప్రదించి తమ కుమార్తె వ్యవహారాన్ని వదిలివేయాలని వేడుకున్నారు. వారి వద్దనున్న ఫొటోలు, వీడియోలు తీసుకున్నారు. ఈ క్రమంలో తాజాగా ఆ యువతి నగ్నచిత్రాలు ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రత్యక్షమయ్యాయి. 
 
దీంతో కుటుంబ సభ్యులు దిశ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించారు. ఎస్పీ అమ్మిరెడ్డి ఆదేశాల మేరకు సాంకేతిక ఆధారాలు సేకరించిన పోలీసులు నిందితులు వరుణ్‌, కౌశిక్‌లను అరెస్టు చేశారు. ఆమె నగ్న చిత్రాలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది ఎవరనేది తెలుసుకునేందుకు టెక్నికల్‌ సిబ్బంది దర్యాప్తు చేస్తున్నట్లు అర్బన్‌ ఎస్పీ అమ్మిరెడ్డి తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments