Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారీ బందోబస్తు కల్పించాం.. కానీ బారికేడి విరిగిపోవడంతో తొక్కిసలాట.. గుంటూరు ఎస్పీ

Webdunia
సోమవారం, 2 జనవరి 2023 (10:52 IST)
గుంటూరులో చంద్రన్న కానుకల పంపిణీ కార్యక్రమంలో తొక్కిసలాట జరిగి ఇద్దరు మహిళలతో సహా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై గుంటూరు జిల్లా ఎస్పీ స్పందించారు. ఉయ్యూరు చారిటబుల్ ట్రస్ట్ తరపున జరిగిన చంద్రన్న కానుకల పంపిణీకి భారీ స్థాయిలో పోలీస్ బందోబస్తు కల్పించామని చెప్పారు. అయితే, ఒకటో నంబరు కౌంటర్ వద్ద బారిగేడ్ విరిగిపోవడంతో ఓ మహిళ కింద పడ్డారని, వెనుక ఉన్న మహిళలు ఒక్కసారిగా తోసుకుని ముందుకు రావడంతో ఈ తొక్కిసలాట సంభవించిందని ఆయన తెలిపారు.
 
తాము సరిపడినంత బందోబస్తు ఇచ్చామని, బారికేడ్లు విరిగిపడటంతోనే ప్రమాదం జరిగిందని చెప్పారు. పైగా, ముందు జాగ్రత్తలు తీసుకోవాలని తాము ట్రస్ట్ నిర్వాహకులకు చెప్పామన్నారు. ముఖ్యంగా, చంద్రన్న కానుకల పంపిణీపై నిర్వాహకులు గత కొన్ని రోజులుగా ప్రచారం చేయడంతో ఈ కార్యక్రమానికి ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారని చెప్పారు. 
 
చంద్రన్న కానుకల కోసం మధ్యాహ్నం 2 గంటల నుంచి మహిళలు క్యూలైన్లలో ఉన్నారని తెలిపారు. ఈ క్రమంలో ఓ కౌంటర్ వద్ద బారికేడ్ విరిగిపోవడంతో క్యూలైన్‌లో ఉన్న మహిళలు ముందుకుపడిపోగా వెనుక ఉన్నవారు ఒక్కసారిగా వారిపై పడటంతో ఓ మహిళ ఊపిరాకడ అక్కడికక్కడే మృతి చెందినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారని ఎస్పీ వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బుధవారం లోగా బ్రేక్ ఈవెన్ అవుతుందని డిస్ట్రిబ్యూటర్స్ చెప్పడం హ్యాపీగా వుంది : కళ్యాణ్ రామ్

నా కూతురు కిరోసిన్ తాగిందని నా భార్య ఫోన్ చేసింది, ఇక నా పరిస్థితి: తనికెళ్ల భరణి

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

తర్వాతి కథనం
Show comments