Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా సమయంలో కల్వరి సేవలు అమోఘం: ఎమ్మెల్యే కిలారి

Webdunia
శుక్రవారం, 17 డిశెంబరు 2021 (13:29 IST)
పశువుల పాకలో జన్మించి లోకానికే ఆరాధ్యుడైన దయామయుడు, ప్రపంచానికి శాంతి సందేశాన్ని చాటిన కారుణామయుడు ప్రభువైన యేసుక్రీస్తు అని ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య అన్నారు.  ప్రపంచవ్యాప్తంగా సంతోషంగా ఘనంగా జరుపుకునే పండుగ క్రిస్టమస్ అంటూ, రాష్ట్ర ప్రజలకు ముందుగా క్రిస్మస్ శుభాకాంక్షలను తెలియజేశారు. 

 
గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గం పెదకాకాని మండల పరిధిలోని నంబూరు గ్రామంలో కల్వరి టెంపుల్ ఆధ్వర్యంలో నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకలలో వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, పొన్నూరు ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య ముఖ్య అతిథిగా పాలుపంచుకుని ప్రసంగించారు. దేవుని సందేశాన్ని ప్రజల్లోకి తీసుకువెళుతున్నకల్వరి టెంపుల్ వ్యవస్థాపకుడు సతీష్ సందేశం అద్భుతమన్నారు. ఆయన వాక్యం వినటం కోసం వివిధ జిల్లాల నుంచి వేలాదిమంది తరలి రావటం సామాన్యమైన విషయం కాదన్నారు. 
 
 
కరోనా కష్టకాలంలో ఒక్క రూపాయి కూడా ఆశించకుండా కల్వరి టెంపుల్ అందించిన సేవలు అమోఘం, అభినందనీయమని కొనియాడారు. ఈ సెమీ క్రిస్మస్ వేడుకలలో పాల్గొనటం చాలా సంతోషంగా ఉందంటూ హర్షం వ్యక్తం చేస్తూ, మరొక్కసారి వేదికపై నుంచి క్రిస్మస్ శుభాకాంక్షలను తెలిపారు ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెనం: ది లాస్ట్ డ్యాన్స్ ట్రైలర్ 1500 స్క్రీన్‌లలో ప్లే అవుతోంది

మా నాన్న సూపర్ హీరో నుంచి వేడుకలో సాంగ్ రిలీజ్

ఐఫా-2024 అవార్డ్స్- ఉత్తమ నటుడు నాని, చిత్రం దసరా, దర్శకుడు అనిల్ రావిపూడి

సత్య దేవ్, డాలీ ధనంజయ జీబ్రా' గ్లింప్స్ రాబోతుంది

అప్సరా రాణి రాచరికం లోని ఏం మాయని రొమాంటిక్ మెలోడీ పాట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైబీపి కంట్రోల్ చేసేందుకు తినాల్సిన 10 పదార్థాలు

బొప్పాయితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

పిల్లల మెదడు ఆరోగ్యానికి ఇవి పెడుతున్నారా?

పొద్దుతిరుగుడు విత్తనాలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments