Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా సమయంలో కల్వరి సేవలు అమోఘం: ఎమ్మెల్యే కిలారి

Webdunia
శుక్రవారం, 17 డిశెంబరు 2021 (13:29 IST)
పశువుల పాకలో జన్మించి లోకానికే ఆరాధ్యుడైన దయామయుడు, ప్రపంచానికి శాంతి సందేశాన్ని చాటిన కారుణామయుడు ప్రభువైన యేసుక్రీస్తు అని ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య అన్నారు.  ప్రపంచవ్యాప్తంగా సంతోషంగా ఘనంగా జరుపుకునే పండుగ క్రిస్టమస్ అంటూ, రాష్ట్ర ప్రజలకు ముందుగా క్రిస్మస్ శుభాకాంక్షలను తెలియజేశారు. 

 
గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గం పెదకాకాని మండల పరిధిలోని నంబూరు గ్రామంలో కల్వరి టెంపుల్ ఆధ్వర్యంలో నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకలలో వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, పొన్నూరు ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య ముఖ్య అతిథిగా పాలుపంచుకుని ప్రసంగించారు. దేవుని సందేశాన్ని ప్రజల్లోకి తీసుకువెళుతున్నకల్వరి టెంపుల్ వ్యవస్థాపకుడు సతీష్ సందేశం అద్భుతమన్నారు. ఆయన వాక్యం వినటం కోసం వివిధ జిల్లాల నుంచి వేలాదిమంది తరలి రావటం సామాన్యమైన విషయం కాదన్నారు. 
 
 
కరోనా కష్టకాలంలో ఒక్క రూపాయి కూడా ఆశించకుండా కల్వరి టెంపుల్ అందించిన సేవలు అమోఘం, అభినందనీయమని కొనియాడారు. ఈ సెమీ క్రిస్మస్ వేడుకలలో పాల్గొనటం చాలా సంతోషంగా ఉందంటూ హర్షం వ్యక్తం చేస్తూ, మరొక్కసారి వేదికపై నుంచి క్రిస్మస్ శుభాకాంక్షలను తెలిపారు ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Keneesha: రవి మోహన్ ప్రేయసి కెనీషా ఫ్రాన్సిస్ ప్రెగ్నెంటా?

Ram Charan: నైట్ పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్ కేక్ కట్ చేశాడు

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments