Webdunia - Bharat's app for daily news and videos

Install App

డీమార్ట్‌లో జనసైనికుల చోరీ చేసినట్టు దుష్ప్రచారం...

Webdunia
గురువారం, 1 సెప్టెంబరు 2022 (14:44 IST)
గుంటూరులోని ప్రముఖ సూపర్ మార్కెట్ డిమార్ట్‌లో పవన్ కళ్యాణ్ సారథ్యంలోని జనసేన పార్టీకి చెందిన కార్యకర్తలు (జనసైనికులు) చోరీ చేసినట్టు దుష్ప్రచారం సాగుతోంది. దీనిపై గంటూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు గాదె వెంకటేశ్వర్లు స్పందించారు. డిమార్ట్ షోరూమ్‌లో జనసైనికులు చోరీ చేసినట్టు సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతుందన్నారు. ఇందులో ఏమాత్రం నిజం లేదన్నారు. కేవలం జనసేనను భ్రష్టుపట్టించేందుకు సోషల్ మీడియా వేదికగా దుష్ప్రచారం సాగుతోందన్నారు. తమ పార్టీపై బురదజల్లే ప్రయత్నంలో భాగంగానే ఈ ప్రచారం చేస్తున్నారని చెప్పారు. 
 
కాగా, గుంటూరు పట్టణంలోని నాజ్ సెంటరులో డిమార్ట్ యాజమాన్యంతో తాము మాట్లాడామని, వారు కూడా అలాంటిదేమీ జరగలేదని ఆశ్చర్యం వ్యక్తం చేశారని తెలిపారు. తమ పార్టీకి వస్తున్న ఆదరణను చూసి తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని ఆయన కోరారు. ఇలాంటి తప్పుడు ప్రచారం చేసేవారిపై భవిష్యత్‌పై గట్టి చర్యలు తీసుకుంటామని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

తర్వాతి కథనం
Show comments