Webdunia - Bharat's app for daily news and videos

Install App

డీమార్ట్‌లో జనసైనికుల చోరీ చేసినట్టు దుష్ప్రచారం...

Webdunia
గురువారం, 1 సెప్టెంబరు 2022 (14:44 IST)
గుంటూరులోని ప్రముఖ సూపర్ మార్కెట్ డిమార్ట్‌లో పవన్ కళ్యాణ్ సారథ్యంలోని జనసేన పార్టీకి చెందిన కార్యకర్తలు (జనసైనికులు) చోరీ చేసినట్టు దుష్ప్రచారం సాగుతోంది. దీనిపై గంటూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు గాదె వెంకటేశ్వర్లు స్పందించారు. డిమార్ట్ షోరూమ్‌లో జనసైనికులు చోరీ చేసినట్టు సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతుందన్నారు. ఇందులో ఏమాత్రం నిజం లేదన్నారు. కేవలం జనసేనను భ్రష్టుపట్టించేందుకు సోషల్ మీడియా వేదికగా దుష్ప్రచారం సాగుతోందన్నారు. తమ పార్టీపై బురదజల్లే ప్రయత్నంలో భాగంగానే ఈ ప్రచారం చేస్తున్నారని చెప్పారు. 
 
కాగా, గుంటూరు పట్టణంలోని నాజ్ సెంటరులో డిమార్ట్ యాజమాన్యంతో తాము మాట్లాడామని, వారు కూడా అలాంటిదేమీ జరగలేదని ఆశ్చర్యం వ్యక్తం చేశారని తెలిపారు. తమ పార్టీకి వస్తున్న ఆదరణను చూసి తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని ఆయన కోరారు. ఇలాంటి తప్పుడు ప్రచారం చేసేవారిపై భవిష్యత్‌పై గట్టి చర్యలు తీసుకుంటామని తెలిపారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments