Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనుమానంతో ప్రేయసి గొంతు కోసిన ప్రేమికుడు

Webdunia
గురువారం, 21 ఫిబ్రవరి 2019 (17:35 IST)
గుంటూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. అతిగా ప్రేమించడం వల్ల అది కాస్త అనుమానంగా మారి ఫలితంగా హత్యకు దారి తీసింది. ప్రియురాలి మీద అనుమానంతో ఆమెపై దాడి చేయడమే కాకుండా అతి కిరాతకంగా గొంతు కోసి చంపాడు ఓ ఉన్మాది ప్రియుడు. ఈ ఘటన గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలో జరిగింది. 
 
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. తెనాలికి చెందిన సత్యనారాయణ, జ్యోతి కొన్ని సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. అంతేకాకుండా వారిద్దరూ సహజీవనం చేస్తున్నారు. సత్యనారాయణకు జ్యోతిపై ఉన్న ప్రేమ అనుమానంగా మారింది. ఆమెపై అనుమానం పెరిగిపోవడంతో అతడు విచక్షణ కోల్పోయాడు. 
 
గురువారం జ్యోతిపై దాడికి పాల్పడి, కత్తితో గొంతు కోసి దారుణంగా హత్య చేసాడు. ఆ తర్వాత తానే జ్యోతిని హత్య చేసినట్లు చెప్పి పోలీసుల ఎదుట లొంగిపోయాడు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.

సంబంధిత వార్తలు

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments