Webdunia - Bharat's app for daily news and videos

Install App

అప్పు తీర్చమన్న మహిళ.. కాలితో తన్నిన ఆటో డ్రైవర్

Webdunia
శుక్రవారం, 6 ఆగస్టు 2021 (15:40 IST)
గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఓ దారుణం జరిగింది. తన వద్ద తీసుకున్న అప్పును తిరిగి చెల్లించాలని ఓ మహిళ కోరింది. దీంతో ఆగ్రహించిన ఆటో డ్రైవర్ ఆ మహిళను కాలితో తన్నాడు. దీంతో ఆ మహి అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. బాధితురాలు ప్రస్తుతం మంగళగిరి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.
 
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లా చిర్రావూరుకు చెందిన గోపీకృష్ణ అనే యువకుడికి గోవర్ధని అనే మహిళ గతంలో వడ్డీకి రూ.3 లక్షలు అప్పు ఇప్పించింది. అప్పు తీర్చమని అడుగుతుంటే గోపి పట్టించుకోలేదు. దీంతో గోపి స్వగ్రామం చిర్రావూరు వెళ్లి బాకీ తీర్చాలని అడిగింది. 
 
ఈ క్రమంలో తీవ్ర ఆగ్రహానికి గురైన గోపి.. గోవర్ధనిని కాలితో బలంగా తన్నాడు. దీంతో ఆమె కుప్పకూలింది. అక్కడికి కాసేపటికి 100 నంబరుకు గోవర్ధని ఫోన్‌ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అనంతరం మంగళగిరి రూరల్‌ పోలీసులు గోపీకృష్ణను అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అతడిపై కేసు నమోదు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

సునీల్ కీలక పాత్రలో తమిళ, తెలుగు ద్విభాషా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments