లోన్ యాప్ రుణం తీర్చేందుకు కిడ్నీ అమ్ముకున్న ఆటో డ్రైవర్... రూ.లక్ష చేతిలో పెట్టి మోసం చేసిన వైద్యులు!! (Video)

వరుణ్
మంగళవారం, 9 జులై 2024 (11:48 IST)
ఒక లోన్ యాప్‌లో తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లించేందుకు ఓ ఆటో డ్రైవర్ కిడ్నీని మూడు లక్షల రూపాయలకు అమ్ముకున్నాడు. ఆపరేషన్ చేసి కిడ్నీని తీసిన ఆస్పత్రి వైద్యులు మాత్రం రూ.లక్ష చేతిలో పెట్టి మోసం చేశారు. ఈ సంఘటన ఏపీలోని గుంటూరు జిల్లాలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, గుంటూరుకు చెందిన 31 ఏళ్ళ డ్రైవర్ లోన్ యాప్ ద్వారా రుణం తీసుకున్నాడు. తీసుకున్న మొత్తాన్ని నిర్ణీత సమయంలోగా చెల్లించేశాడు. అయితే, రుణం ఇంకా తీరలేదని, మిగతా మొత్తం వెంటనే చెల్లించాలని యాప్ నిర్వాహకులు వేధింపులకు దిగారు. ఈ క్రమంలోనే కిడ్నీ దానం చేస్తే రూ.30 లక్షలు ఇస్తామంటూ ఫేస్‌బుక్‌లో ఓ యాడ్ కనిపించింది. 
 
అందులోని ఫోన్ నెంబర్‌ను సంప్రదించగా.. విజయవాడలోని ఓ ఆసుపత్రికి తీసుకెళ్లి, ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించి కిడ్నీ తీసుకున్నారు. ఆ తర్వాత డబ్బులు అడిగితే నెలల పాటు తిప్పించుకుని 7 నెలల తర్వాత రూ.లక్ష చేతిలో పెట్టారని ఆటోడ్రైవర్ ఆవేదన వ్యక్తంచేశాడు. మరోవైపు, లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులు రోజురోజుకూ పెరుగుతున్నాయని, ఇటు ఏజెంట్లు మోసం చేశారని కన్నీటిపర్యంతమయ్యాడు. ఆ ఆటో డ్రైవర్‌ బోరున విలపిస్తూ తనకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తున్న వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. 


 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: గోండ్ తెగల బ్యాక్ డ్రాప్ లో రష్మిక మందన్న.. మైసా

Dil Raju: రామానాయుడు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి ని స్ఫూర్తిగా తీసుకున్నా : దిల్ రాజు

Sharva : మోటార్ సైకిల్ రేసర్ గా శర్వా.. బైకర్ చిత్రం ఫస్ట్ లుక్

Chiranjeevi: సైకిళ్లపై స్కూల్ పిల్లలుతో సవారీ చేస్తూ మన శంకరవర ప్రసాద్ గారు

భవిష్యత్‌లో సన్యాసం స్వీకరిస్తా : పవన్ కళ్యాణ్ మాజీ సతీమణి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments