Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేపల్లెలో జవాను కాల్పుల కలకలం.. రేప్ కేసు పెట్టిందనీ...

Webdunia
శనివారం, 22 ఫిబ్రవరి 2020 (15:09 IST)
గుంటూరు జిల్లా రేపల్లె నియోజకవర్గం చెరుకుపల్లి మండలం నడింపల్లి గ్రామంలో కాల్పుల కలకలం. ప్రేమించి మోసం చేసినందుకు రేప్ కేసు పెట్టిందన్న అక్కసుతో యువతి, ఆమె తల్లిపై ఓ ఆర్మీ జవాన్ కాల్పులకు తెగబడ్డాడు. దీంతో తీవ్రంగా గాయపడిన ఆ తల్లీబిడ్డను ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, నడుంపల్లి గ్రామానికి చెందిన మురాల రమాదేవి, ఆమె కుమార్తె నాగజ్యోతి ప్రేమకు నిరాకరించిందని కారణంతో నల్లమోతువారిపాలెం గ్రామానికి చెందిన ఏమినేని బాలాజీ కాల్పులు జరిపాడు. ఆర్మీలో పని చేస్తూ వివాహం చేసుకుంటానని నాగజ్యోతిని మోసం చేశాడు. 
 
పెళ్లి చేసుకుంటానని మోసం చేయడంతో గత డిసెంబర్లో బాపట్ల పట్టణ పోలీస్ స్టేషనులో కేసు నమోదైంది. నాగజ్యోతి రేప్ కేసు పెట్టడంతో అరెస్టు అయి ఆ తర్వాత బెయిలుపై బయటకు వచ్చిన బాలాజీ శుక్రవారం అర్థరాత్రి రెండు గంటలు దాటిన తర్వాత రివాల్వర్, మరణాయుధాలతో రమాదేవి ఇంటికి వచ్చి తల్లి, కుమార్తెపై కాల్పులు జరిపాడు. రమాదేవికి చెవి దగ్గర గాయమైంది. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shwetha Menon: AMMA ప్రెసిడెంట్‌గా తొలి మహిళా నటిగా రికార్డ్

Viswant: భావనను వివాహం చేసుకున్న హీరో విశ్వంత్ దుడ్డుంపూడి

Venkatesh: విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమా మొదలు

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం
Show comments