Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేపల్లెలో జవాను కాల్పుల కలకలం.. రేప్ కేసు పెట్టిందనీ...

Webdunia
శనివారం, 22 ఫిబ్రవరి 2020 (15:09 IST)
గుంటూరు జిల్లా రేపల్లె నియోజకవర్గం చెరుకుపల్లి మండలం నడింపల్లి గ్రామంలో కాల్పుల కలకలం. ప్రేమించి మోసం చేసినందుకు రేప్ కేసు పెట్టిందన్న అక్కసుతో యువతి, ఆమె తల్లిపై ఓ ఆర్మీ జవాన్ కాల్పులకు తెగబడ్డాడు. దీంతో తీవ్రంగా గాయపడిన ఆ తల్లీబిడ్డను ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, నడుంపల్లి గ్రామానికి చెందిన మురాల రమాదేవి, ఆమె కుమార్తె నాగజ్యోతి ప్రేమకు నిరాకరించిందని కారణంతో నల్లమోతువారిపాలెం గ్రామానికి చెందిన ఏమినేని బాలాజీ కాల్పులు జరిపాడు. ఆర్మీలో పని చేస్తూ వివాహం చేసుకుంటానని నాగజ్యోతిని మోసం చేశాడు. 
 
పెళ్లి చేసుకుంటానని మోసం చేయడంతో గత డిసెంబర్లో బాపట్ల పట్టణ పోలీస్ స్టేషనులో కేసు నమోదైంది. నాగజ్యోతి రేప్ కేసు పెట్టడంతో అరెస్టు అయి ఆ తర్వాత బెయిలుపై బయటకు వచ్చిన బాలాజీ శుక్రవారం అర్థరాత్రి రెండు గంటలు దాటిన తర్వాత రివాల్వర్, మరణాయుధాలతో రమాదేవి ఇంటికి వచ్చి తల్లి, కుమార్తెపై కాల్పులు జరిపాడు. రమాదేవికి చెవి దగ్గర గాయమైంది. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

Comedian Ali: కమెడియన్ అలీ కూడా బెట్టింగ్ యాప్‌‌లో చిక్కుకున్నారా?

Uday Raj: 1990 నాటి టీనేజ్ లవ్ స్టోరీతో మధురం చిత్రం

Aamani : డొక్కా సీతమ్మ తో ఆమని కి అవార్డు రావాలి: మురళీ మోహన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments