Webdunia - Bharat's app for daily news and videos

Install App

పదో తరగతి పరీక్షల్లో సత్తా చాటిన ఆరో తరగతి విద్యార్థిని

Webdunia
సోమవారం, 8 మే 2023 (11:21 IST)
ఏపీలో గత శనివారం పదో తరగతి పరీక్షా ఫలితాలు వెల్లడయాయి. ఈ పరీక్షాల్లో ఆరో తరగతి అమ్మాయి సత్తా చాటింది. ఆరో తరగతి బాలిక పదో తరగతి పరీక్షల్లో ఏకంగా 566 మార్కులు సాధించి, శభాష్ అనిపించుకుంది. ఆ బాలిక బేరు చిర్రా అనఘాలక్ష్మి. గుంటూరు పట్ణం. స్థానికంగా ఉండే బ్రాడీపేటలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఆరో తరగతి చదువుతోంది. బాలిక తండ్రి విష్ణువర్థన్ రెడ్డి. మంగళగిరి భారతీయ స్టేట్ బ్యాంకులో ఉద్యోగి కాగా, తల్లి సత్యదేవి ఎమ్మెస్సీ బీఈడీ పూర్తిచేశారు. 
 
తల్లి ప్రోత్సాహంతో చిన్నప్పటి నుంచే అబాకస్, వేదిక్ మ్యాథ్స్‌లలో ప్రతిభ కనబరుస్తూ వచ్చిన అనఘా లక్ష్మి... గణిత అవధానాల్లో శతావధాన స్థాయికి చేరుకున్నారు. చిత్తూరులో జరిగిన ఓ కార్యక్రమంలో బాలిక ప్రతిభకు ముగ్ధుడైన మంత్రి ఆదిమూలపు సురేష్.. ఆ బాలికతో పదో తరగతి పరీక్షలు రాయించాలని సూచించారు. 
 
ఆ తర్వాత ఉన్నతాధికారుల అనుమతితో ఇటీవల ఇతర విద్యార్థులతో కలిసి పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరైంది. శనివారం విడుదలైన ఈ ఫలితాల్లో ఆ బాలిక 600కు గాను 566 మార్కులు సాధించి తన సత్తా చాటింది. అలాగే కాకినాడకు చెందిన ఆరో తరగతి విద్యార్థిని ముప్పల హేమశ్రీ కూడా పదో తరగతి పరీక్షలు రాసి 488 మార్కులు సాధించి అందరితో శభాష్ అనిపించుకుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

డాక్టర్ కూ పేషెంట్స్‌కి మధ్య సరైన వ్యక్తిలేకపోతే ఏమిటనేది డియర్ ఉమ : సుమయ రెడ్డి

ఓటీటీలు నిర్మాతలకు శాపంగా మారాయా? కొత్త నిర్మాతలు తస్మాత్ జాగ్రత్త!

Chaganti: హిట్ 3 లోని క్రూరమైన హింసను చాగంటి కి ముందుగా చెప్పలేదా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

తర్వాతి కథనం
Show comments