ఎస్ఆర్ఎం విద్యార్థినికి గిన్నిస్ రికార్డ్ టైటిల్

Webdunia
బుధవారం, 2 డిశెంబరు 2020 (06:11 IST)
ఏపీ ఎస్ఆర్ఎం విశ్వ విద్యాలయానికి చెందిన కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ నాలుగో సంవత్సరం విద్యార్థిని గారిపల్లి వైష్ణవి ప్రతిష్టాత్మక మైన గిన్నిస్ వరల్డ్ రికార్డ్ టైటిల్ ను సొంతం చేసుకుంది.  
 
సైబర్ సెక్యూరిటీలో తొలిసారి బ్లాక్ చైన్ టెక్నాలజీని సమర్థవంతంగా ఉపయోగించినందుకు గానూ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ టైటిల్ దక్కినట్లు వైష్ణవి పేర్కొంది.  
 
ఇంజనీరింగ్ టెక్నాలజీలో ఎదురవుతోన్న తాజా సవాళ్లపై  అక్టోబరు 30 న జరిగిన అంతర్జాతీయ సదస్సులో  తన పరిశోధన పత్రం ప్రచురణకు నోచుకున్నట్లు వివరించింది. 
 
వైష్ణవి అభివృద్ధి చేసిన యాప్ వల్ల కంప్యూటర్ లో ముఖ్యమైన డేటా చోరీకి గురయ్యే అవకాశం లేదు. అంతే కాకుండా ఫేస్ బుక్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా మాధ్యమాలపై సైబర్ ఎటాక్ జరిగే అవకాశం తక్కువ. దీన్ని గుర్తిఃచిన గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కమిటీ వైష్ణవి ప్రతిభను ప్రశంసిస్తూ గిన్నిస్ సర్టిఫికెట్ ను ప్రధానం చేసింది.  

బ్లాక్ చైన్ టెక్నాలజీని సక్రమంగా ఉపయోగించడం, అభివృద్ధి చేయడం వల్ల అత్యంత ముఖ్యమైన కంప్యూటర్ సమాచారానికి పూర్తి రక్షణ ఏర్పడుతుందని వైష్ణవి పేర్కొంది. ఈ సందర్భంగా యూనివర్సిటీ యాజమాన్యం విద్యార్థిని వైష్ణవి ని ప్రత్యేకంగా అభినందించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీ స్రవంతి మూవీస్ ద్వారా తెలుగులో ప్రణవ్ మోహన్ లాల్.. డియాస్ ఇరాయ్

Samantha: స‌మంత‌ నిర్మాతగా మా ఇంటి బంగారం ప్రారంభ‌మైంది

JD Laxman: యువతరం ఏది చేసినా ప్యాషన్ తో చేయాలి : జే.డి. లక్ష్మీ నారాయణ

Chiru song: మన శంకరవరప్రసాద్ గారు ఫస్ట్ సింగిల్ 36 మిలియన్ వ్యూస్ తో సెన్సేషన్‌

Naga Shaurya : అందమైన ఫిగరు నువ్వా .. అంటూ టీజ్ చేస్తున్న బ్యాడ్ బాయ్ కార్తీక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments