Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనాతో మరణించినవారి అంత్యక్రియలకు ప్రభుత్వ సాయం

Webdunia
సోమవారం, 14 జూన్ 2021 (20:32 IST)
రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు కరోనా బారినపడి మరణించినవారి మట్టి ఖర్చుల నిమిత్తం రూ.15 వేలు వారి కుటుంబ సభ్యులకు అందించబడతాయని డియంహెచ్ఓ డా.యం.సుహాసిని ఒక ప్రకటనలో తెలిపారు.
 
 కరోనా మూలంగా మరణించినట్లు సంబంధిత వైద్యుని ధృవీకరణ పిమ్మట వారి కుటుంబ సభ్యుల నామిని దారులకు మట్టి ఖర్చుల నిమిత్తం రూ.15 వేలు అందజేయబడుతుందన్నారు.  దీనికిగాను వైద్యుడు ధ్రువీకరించిన మరణ ధ్రువీకరణ పత్రం,తహసీల్దార్ చే ధృవీకరించబడి  మంజూరు చేయబడిన కుటుంబ సభ్యుల పత్రం తప్పనిసరి.
 
పై ధ్రువీకరణ పత్రాలను సంబంధిత సచివాలయ, ఆరోగ్య కార్యకర్తల ద్వారా సంబంధిత పి హెచ్ సి వైద్యాధికారి వారికి అందజేయాలన్నారు. వారి యొక్క బ్యాంకు ఖాతా నెంబరు ఐఎఫ్ఎస్ సి కోడ్ బ్యాంక్ పేరు మరియు బ్రాంచ్ వివరాలను జతపరిచి అందజేయాల్సి వుందన్నారు.

ఈ విధంగా సమర్పించిన పత్రాలను సంబంధిత అధికారులు పరిశీలించి అర్హులైన వారి ఖాతాలోకి 15 వేల రూపాయలు జమ చేయడం జరుగుతుందన్నారు. కావున బాధిత కుటుంబ సభ్యులు పైన పేర్కొన్న వివరములను గమనించాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారిణి సుహాసిని  తెలియజేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments