Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోలీసులకు శుభవార్త చెప్పిన సీఎం జగన్... ఏంటది?

Webdunia
మంగళవారం, 18 జూన్ 2019 (16:32 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులకు ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి శుభవార్త చెప్పారు. తమ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్నట్టుగా పోలీసలకు వారాంతపు సెలవును ప్రకటించారు. ఈ వీక్లీ ఆఫ్ బుధవారం నుంచే అమల్లోకి రానుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వీక్లీ ఆఫ్ విధానాన్ని ప్రవేశపెట్టారు. దీంతో ఏపీ శాంతి భద్రతల విభాగం అదనపు డైరెక్టర్ జనరల్ డాక్టర్ రవిశంకర్ ఉత్తర్వులు జారీచేశారు. 
 
పోలీసుల విక్లీ ఆఫ్‌పై ఆయన వెల్లడించిన వివరాల మేరకు.. నవ్యాంధ్రలోని పోలీసు శాఖలో పని చేసే కానిస్టేబుల్ నుంచి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ స్థాయి వరకు పని చేసే పోలీసులకు వారాంతపు సెలవును మంజూరు చేస్తున్నట్టు తెలిపారు. ఈ వీక్లీ ఆఫ్ విధానం ఇప్పటికే విశాఖపట్టణం జిల్లాలో అమలు చేస్తుండగా, ఇపుడు వైఎస్ఆర్ కడప జిల్లాలో ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు. 
 
ఇది సక్సెస్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధానాన్ని పక్కాగా అమలు చేయనున్నారు. ఈ వారాంతపు సెలవుతో పోలీసులు ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుందని, తద్వారా అనారోగ్యం బారినపడకుండా ఉండేందుకు అవకాశం ఉందన్నారు. పైగా, వీక్లీ ఆఫ్‌పై ఫీడ్‌బ్యాక్ తీసుకుంటామని ఆయన వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జన్మదినంనాడు రామ్ పోతినేని 22వ చిత్రం టైటిల్ ప్రకటన

క్రైం ఇన్వెస్టిగేషన్ తో ఆసక్తికరంగా కర్మణ్యే వాధికారస్తే ట్రైలర్

శ్రీ విష్ణు కు #సింగిల్‌ సక్సెస్ సాదించి పెడుతుందా - ప్రివ్యూ రిపోర్ట్

ప్రెగ్నెన్సీ పుకార్లే అని ఖండించిన నాగ చైతన్య, శోభితా టీమ్

నితిన్, శ్రీలీల మూవీ రాబిన్‌హుడ్‌ జీ5లో స్ట్రీమింగ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments