Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీటీడీ ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్..

Webdunia
శుక్రవారం, 7 మే 2021 (19:54 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగులకు ఏపీ సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. టీటీడీలో పని చేస్తున్న ఉద్యోగులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు. టీటీడీ బోర్డు నిర్ణయాన్ని ఆమోదిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు తిరుపతి పరిసర ప్రాంతాల్లో 250 ఎకరాల నుంచి 400 ఎకరాల భూమిని గుర్తించాలని కలెక్టర్‌ను ఆదేశించారు.
 
ఇక వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాల జోరు కొనసాగుతోంది. పాదయాత్ర సమయంలో జగన్ ఇచ్చిన నవరత్నాల హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తున్నారు.
 
ఇప్పటికే జగనన్న ఇళ్ల పేరుతో రాష్ట్రవ్యాప్తంగా 30 లక్షల మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఇళ్లు కట్టించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అమ్మఒడి, పెన్షన్, ఫీజురీయింబర్స్ మెంట్ వంటి పథకాలను అమలు చేస్తున్నారు. తాజాగా టీటీడీ ఉద్యోగులకు కూడా ఇళ్ల పట్టాలు పంపిణీకి సిద్ధమవుతుండటం విశేషం.

సంబంధిత వార్తలు

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments