Webdunia - Bharat's app for daily news and videos

Install App

క‌ల్ప‌వృక్ష వాహనంపై గోకుల నందనుడు

Webdunia
సోమవారం, 19 అక్టోబరు 2020 (20:44 IST)
తిరుపతి తుమ్మలగుంట శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో నాలుగో రోజైన సోమవారం శ్రీ వారు కల్పవృక్ష వాహనంపై గోకుల నందనుడి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. గోవుల గోప‌న్న‌గా శ్రీవారు భక్తులను కటాక్షించారు.

క్షీరసాగరమథనంలో ఉద్భవించిన  క‌ల్ప‌వృక్షం నీడన చేరిన వారికి ఆకలిదప్పులుండవు, కోరుకున్న‌ కోరికలు నెరవేరుతాయని వేద పండితులు పేర్కొన్నారు. అంతటి విశిష్టత కలిగిన క‌ల్ప‌వృక్ష‌ వాహనాన్ని అధిరోహించి స్వామి వారు ఆలయ మాడ వీధుల్లో విహరిస్తూ భక్తుల కోర్కెలను తీర్చారు.

గోవింద మాల ధారణతో ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త, ప్రభుత్వ విప్, తుడా చైర్మెన్, చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ సతీసమేతంగా పాల్గొన్నారు. కంకణ డారుడైన చెవిరెడ్డి తమ్ముడు రఘునాథ్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు. 
 
సర్వభూపాల వాహనంపై..
శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు సోమవారం రాత్రి ఆలయ మాడ వీధుల్లో స్వామివారు ఉభయదేవేరులతో కలిసి సర్వభూపాల వాహ‌నంపై భక్తులకు దర్శనమిచ్చారు. అంతకుముందు ఊంజల్ సేవ వేడుకగా నిర్వహించారు. వాహన సేవలో ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త  డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు. 
 
మంగళవారం బ్రహ్మోత్సవాలు ..
బ్రహ్మోత్సవాలలో ఐదో రోజైన మంగళవారం ఉదయం మోహినీ అవతారం, రాత్రి గరుడ వాహనంపై కళ్యాణ వెంకన్న విహరిస్తూ భక్తులను కటాక్షించనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments