Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలకు కాలి నడకన వెళుతున్నారా? జాగ్రత్త దొంగలు వెనకే వస్తున్నారు

Webdunia
సోమవారం, 18 జనవరి 2021 (22:44 IST)
తిరుమల నడకదారిలో దొంగలు హల్‌చల్ సృష్టించారు. అలిపిరి నడకదారిలో కర్నూలుకు చెందిన భక్తులపై దొంగలు దోపిడీకి యత్నించారు. భక్తులు ప్రతిఘటించడంతో దొంగలు పారిపోయారు. 
 
నిన్న సాయంత్రం చీకటి పడే సమయానికి అలిపిరి మార్గం నుంచి కర్నూలుకు చెందిన భక్త బృందం తిరుమలకు బయలుదేరింది. చిన్నపిల్లలతో పాటు మొత్తం 9 మంది కుటుంబ సభ్యులు ఉన్నారు. 
 
నడిచి వస్తుండగా సరిగ్గా నడకదారికి సగభాగంలో నలుగురు యువకులు కనిపించారు. వారు వీరి వెనుకలే వస్తూ టార్చ్ లైట్ వారి ముఖంపై వేస్తూ హేళనగా మాట్లాడటం మొదలుపెట్టారు. ఆ తరువాత చిన్నపిల్లల మెడలో ఉన్న బంగారు చైన్లను లాక్కునేందుకు ప్రయత్నించారు.
 
దీంతో భక్తబృందంలోని ముగ్గురు మగవారు దొంగలతో ప్రతిఘటించడంతో పాటు వారితో పాటు ఉన్న వారు గట్టిగా కేకలు వేయడంతో దగ్గరలో నడిచివస్తున్న కొంతమంది భక్తులు అక్కడకు చేరుకున్నారు. భక్త బృందం ఎక్కువగా వస్తుండడాన్ని గమనించిన దొంగలు అక్కడి నుంచి పారిపోయారు.
 
అటవీ ప్రాంతంలోకి పరుగులు తీశారు. అయితే మోకాళ్ళ మిట్ట వద్దకు వెళ్ళిన తరువాత టిటిడి విజిలెన్స్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు వెంటనే మొబైల్ వ్యాన్‌లో ఘటనా స్థలి వద్దకు వెళ్ళారు. దొంగలను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajmouli: 1000 + ప్లస్ స్క్రీన్స్ అంటే ఫస్ట్ డే చూడాలనే ఆసక్తిని కలిగింది : ఎస్ఎస్ రాజమౌళి

King dom: సోదరభావానికి వేడుకలా విజయ్ దేవరకొండ, సత్యదేవ్ లపై అన్న అంటేనే.. సాంగ్

హాస్యం నుండి ప్రేమ వరకు, పులకరింతల నుండి కన్నీళ్ల వరకు

Rashmika: రశ్మిక మందన్న ది గర్ల్ ఫ్రెండ్ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

సినిమా చేయాలంటే అన్ని వదిలేసుకుని రావాలి : రానా దగ్గుబాటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

తర్వాతి కథనం
Show comments