Webdunia - Bharat's app for daily news and videos

Install App

చేపల కోసం వల వేస్తే కొండ చిలువ చిక్కింది.. ఎక్కడ?

చేపల కోసం వల వేస్తే కొండ చిలువ వలలో చిక్కుకుపోయిన ఘటన తూర్పుగోదావరి జిల్లా పెదరాయవరం జగ్గరాజుచెరువు వద్ద చోటుచేసుకుంది. గత నాలుగు రోజులుగా తూర్పు గోదావరి జిల్లా జగ్గరాజు చెరువులో చేపల కోసం చాలామంది వల

Webdunia
మంగళవారం, 3 అక్టోబరు 2017 (12:55 IST)
చేపల కోసం వల వేస్తే కొండ చిలువ వలలో చిక్కుకుపోయిన ఘటన తూర్పుగోదావరి జిల్లా పెదరాయవరం జగ్గరాజుచెరువు వద్ద చోటుచేసుకుంది. గత నాలుగు రోజులుగా తూర్పు గోదావరి జిల్లా జగ్గరాజు చెరువులో చేపల కోసం చాలామంది వలలు విసురుతున్నారు. ఇందులో భాగంగా పెదరాయవరం గ్రామానికి చెందిన పీతల చిట్టిబాబు కూడా చేపల కోసం ఈ చెరువులో వల విసిరాడు.
 
ఆపై వలను లాగడం. చిట్టిబాబు తరం కాలేదు. వలలో పెద్ద చేప చిక్కుకుపోయిందని.. అందరినీ పిలిచాడు. దాన్ని అతికష్టం మీద బయటికి లాగే సరికి  వారి గుండె ఝల్లుమంది. తీరా చూస్తే.. వలలో చేపకు బదులు కొండచిలువ చిక్కుకుంది. దాన్ని బయటకు తీయడం వారి వల్ల కాకపోవడంతో... చివరకు గునపాలతో పొడిచి చంపేశారు. అనంతరం ఈ కొండచిలువను పెదరాయవరం ఎస్సీ పేటకు తరలించారు. 
 
ఈ సందర్భంగా దాన్ని చూడ్డానికి భారీ సంఖ్యలో ప్రజలు తరలి వచ్చారు. ఈ సందర్భంగా చిట్టిబాబు మాట్లాడుతూ, నీటి ప్రవాహంలో ఈ కొండచిలువ కొట్టుకువచ్చి వలలో ఇరుక్కుపోయి ఉండవచ్చని తెలిపాడు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments