Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లి చేసుకుంటా అని లాడ్జికి పిలిచి.. బాలికపై లైంగిక దాడి

Webdunia
శనివారం, 21 ఆగస్టు 2021 (10:46 IST)
పశ్చిమగోదావరి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. పెళ్లి చేసుకుంటా అని పిలిచి ఓ యువకుడు 15 ఏళ్ల బాలికపై అత్యాచారం చేశాడు. ద్వారకా తిరుమల ఎస్ఐ టి.వెంకట్ తెలిపిన వివరాల ప్రకారం… పంగిడిగూడెం కు చెందిన పదిహేనేళ్ల బాలిక తో నల్లజర్ల మండలం చోడవరం గ్రామానికి చెందిన యువకుడు పరిచయం పెంచుకున్నాడు. ఏడాదికాలంగా ప్రేమిస్తున్నా అని చెప్పి బాలికను బుట్టలో వేసుకున్నాడు.
 
ఇక ఈ నెల 19వ తేదీన పెళ్లి చేసుకుంటానని ద్వారకా తిరుమలకు బాలికను తీసుకు వెళ్ళాడు. అక్కడ ఓ లాడ్జి తీసుకుని బాలిక పై అత్యాచారం చేసి అనంతరం బస్టాండ్ లో వదిలిపెట్టాడు. తరవాత తనకు పెళ్లి అయిందని చెప్పి బాలికను అక్కడే వదిలి వెళ్ళిపోయాడు.
 
దాంతో బాలిక ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేసింది. కుటుంబ సభ్యులు యువకుడిపై ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NBK: బాలక్రిష్ణ పుట్టినరోజున అఖండ2 అప్ డేట్ రాబోతోంది

Rajendra Prasad: తన ఒరిజినల్ గెటప్ ఇదే అంటున్న రాజేంద్రప్రసాద్

Nikhil: నిఖిల్ కత్తి యోధుడిలా సంయుక్త విల్లు బాణంతో స్వయంభు లో యాక్షన్ సీన్

Sudheer: కృష్ణ కు నివాళితో జటాధర చిత్రం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప్రారంభించిన సుధీర్ బాబు

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం