Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాబోయ్.. దెయ్యం అంటూ బెంబేలెత్తిపోతున్న గ్రామస్తులు.. ఎక్కడ?

Webdunia
బుధవారం, 24 ఏప్రియల్ 2019 (13:30 IST)
శ్రీకాకుళం జిల్లాలోని పలాస మండలం టెక్కలిపట్నంలో నివసిస్తున్న గ్రామస్తులకు దెయ్యం భయం పట్టుకుంది. గ్రామంలో దెయ్యం తిరుగుతోందని ప్రజలు భయపడుతున్నారు. రాత్రి పదిగంటలు దాటితే చాలు జనాలు వణికిపోతున్నారు. రాత్రివేళ ఆడ దెయ్యం ఊరి పొలిమేరలో తిష్టవేసిందని, తమను భయభ్రాంతులకు గురిచేస్తోందని గ్రామస్తులు చెబుతున్నారు. 
 
ఎవరైనా ధైర్యం చేసి అటు వెళితే వారిపై రాళ్లు, ఇసుకతో దాడి చేస్తోందని అంటున్నారు. 7 అడుగుల ఎత్తుతో జుట్టు విరబూసుకుని ఉన్న ఆకారంతో రాత్రి వేళల్లోనే ప్రత్యక్షమవుతుందని భయంభయంగా చెబుతున్నారు.
 
కాగా గ్రామస్తులు చెబుతున్న మాటలను జన విజ్ఞాన వేదిక సభ్యులు తోసిపుచ్చారు. దెయ్యాలు, భూతాలు అనేవి లేవని స్పష్టం చేశారు. మనిషిలో ఉన్న భయమే అలాంటి అపోహలకు కారణం అన్నారు. 
 
దీనిపై అధికారులు స్పందించి గ్రామస్తుల్లో చైతన్యం తీసుకురావాలని, వారిలోని అపోహలను తొలగించాలని కోరారు. ఇసుకతో దాడి చేయడం, రాళ్లతో కొట్టడం ఆకతాయిల పని అయి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments