గ్రేటర్ పోరు : హైదరాబాద్‌లో దిగిన షా.. భాగ్యలక్ష్మి ఆలయంలో పూజలు!

Webdunia
ఆదివారం, 29 నవంబరు 2020 (12:03 IST)
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలను భారతీయ జనతా పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇటీవల జరిగిన దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికల్లో బీజేపీ విజయభేరీ మోగించింది. ఈ విజయం ఇచ్చిన ఉత్సాహంతో బీజేపీ శ్రేణులు ఉరకలేస్తున్నారు. ఇదే సత్తాను గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కూడా చాటాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఇందుకోసమే.. బల్దియా ఎన్నికల ప్రచారంలో బీజేపీ అగ్రనేతలంతా పాల్గొంటున్నారు. 
 
ఇప్పటికే పలువురు బీజేపీ సీనియర్ నేతలు ఈ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఆదివారం కేంద్ర హోం మంత్రి అమిత్ షా హైదరాబాద్ వీధుల్లో రోడ్‌షో నిర్వహించనున్నారు. ఇందుకోసం ఆయన ఆదివారం ఉదయం ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నగరానికి చేరుకున్నారు. బేగంపేట విమానాశ్రయానికి వచ్చిన ఆయనకు బీజేపీ తెలంగాణ నేతలు స్వాగతం పలికారు. అక్కడి నుంచి బీజేపీ నేతలతో కలిసి అమిత్ షా నేరుగా చార్మినార్‌లోని భాగ్యలక్ష్మి ఆలయానికి వెళ్లారు.
 
అక్కడ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి, వేదపండితుల ఆశీర్వచనాలు తీసుకున్నారు. అమ్మవారికి పూజలు చేసిన అనంతరం అమిత్ షా హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో రోడ్ షోలో పాల్గొని బీజేపీ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కాగా, అమిత్ షా రాక సందర్భంగా హైదరాబాద్ నగర వ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఆయన వివిధ కార్యక్రమాలను ముగించుకుని ఆదివారం సాయంత్రానికి ఢిల్లీకి వెళతారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హోటల్ గదిలో ఆత్మను చూశాను... : హీరోయిన్ కృతిశెట్టి

ఫ్యాన్స్‌కు మెగా ఫీస్ట్ - ఎంఎస్‌జీ నుంచి 'శశిరేఖ' లిరికల్ సాంగ్ రిలీజ్ (Video)

థర్డ్ పార్టీల వల్లే సినిమాల విడుదలకు బ్రేక్ - యధావిధిగా ది రాజాసాబ్‌ రిలీజ్ : నిర్మాత విశ్వప్రసాద్

Nandamuri Kalyan: ఛాంపియన్ తో 35 ఏళ్ల తర్వాత నందమూరి కళ్యాణ్ చక్రవర్తి రీఎంట్రీ

మంత్రి సీతక్క లాంచ్ చేసిన కామాఖ్య ఇంటెన్స్ థ్రిల్లింగ్ ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

తర్వాతి కథనం
Show comments