గ్రేటర్ పోరు : హైదరాబాద్‌లో దిగిన షా.. భాగ్యలక్ష్మి ఆలయంలో పూజలు!

Webdunia
ఆదివారం, 29 నవంబరు 2020 (12:03 IST)
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలను భారతీయ జనతా పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇటీవల జరిగిన దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికల్లో బీజేపీ విజయభేరీ మోగించింది. ఈ విజయం ఇచ్చిన ఉత్సాహంతో బీజేపీ శ్రేణులు ఉరకలేస్తున్నారు. ఇదే సత్తాను గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కూడా చాటాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఇందుకోసమే.. బల్దియా ఎన్నికల ప్రచారంలో బీజేపీ అగ్రనేతలంతా పాల్గొంటున్నారు. 
 
ఇప్పటికే పలువురు బీజేపీ సీనియర్ నేతలు ఈ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఆదివారం కేంద్ర హోం మంత్రి అమిత్ షా హైదరాబాద్ వీధుల్లో రోడ్‌షో నిర్వహించనున్నారు. ఇందుకోసం ఆయన ఆదివారం ఉదయం ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నగరానికి చేరుకున్నారు. బేగంపేట విమానాశ్రయానికి వచ్చిన ఆయనకు బీజేపీ తెలంగాణ నేతలు స్వాగతం పలికారు. అక్కడి నుంచి బీజేపీ నేతలతో కలిసి అమిత్ షా నేరుగా చార్మినార్‌లోని భాగ్యలక్ష్మి ఆలయానికి వెళ్లారు.
 
అక్కడ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి, వేదపండితుల ఆశీర్వచనాలు తీసుకున్నారు. అమ్మవారికి పూజలు చేసిన అనంతరం అమిత్ షా హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో రోడ్ షోలో పాల్గొని బీజేపీ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కాగా, అమిత్ షా రాక సందర్భంగా హైదరాబాద్ నగర వ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఆయన వివిధ కార్యక్రమాలను ముగించుకుని ఆదివారం సాయంత్రానికి ఢిల్లీకి వెళతారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: గోండ్ తెగల బ్యాక్ డ్రాప్ లో రష్మిక మందన్న.. మైసా

Dil Raju: రామానాయుడు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి ని స్ఫూర్తిగా తీసుకున్నా : దిల్ రాజు

Sharva : మోటార్ సైకిల్ రేసర్ గా శర్వా.. బైకర్ చిత్రం ఫస్ట్ లుక్

Chiranjeevi: సైకిళ్లపై స్కూల్ పిల్లలుతో సవారీ చేస్తూ మన శంకరవర ప్రసాద్ గారు

భవిష్యత్‌లో సన్యాసం స్వీకరిస్తా : పవన్ కళ్యాణ్ మాజీ సతీమణి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments