Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిత్తూరు ఎంపీ ఎన్నికలు : మిథున్ రెడ్డి ఖర్చు పెట్టింది అంతేనా?

Webdunia
ఆదివారం, 30 జూన్ 2019 (11:48 IST)
సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఎన్నికల ఫలితాలు వెల్లడికావడం కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకావడం, ఆ తర్వాత గెలిచిన అభ్యర్థులు లోక్‌సభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగిపోయింది. అయితే, లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు ఖర్చు పెట్టిన వివరాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. 
 
ముఖ్యంగా, రాయలసీమ జిల్లాల్లోని చిత్తూరు, రాజంపేట లోక్‌సభ స్థానాల్లో పోటీ చేసిన అధికార వైకాపా, ప్రతిపక్ష టీడీపీలు పెట్టిన ఖర్చు వివరాలు వెలుగులోకి వచ్చాయి. ముగిసిన ఎన్నికల్లో చిత్తూరు లోక్‌సభ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థి డాక్టర్‌ శివప్రసాద్‌ రూ.38 లక్షలు వ్యయం చేయగా వైసీపీ అభ్యర్థి రెడ్డెప్ప రూ.23 లక్షలు వెచ్చించారు. 
 
అలాగే, రాజంపేట నియోజకవర్గంలోని ప్రధాన పార్టీల అభ్యర్థులతో పోలిస్తే రిజర్వుడు నియోజకవర్గమైన చిత్తూరులోనే అభ్యర్థులు అధికంగా ఖర్చు చేయడం తమాషాగా అనిపించినా అధికారిక లెక్కలు కావడంతో ఆశ్చర్యపోవాల్సిందే తప్ప చేయగలిగిందేమీ లేదు. 
 
రాజంపేటలో టీడీపీ ఎంపీ అభ్యర్థి సత్యప్రభ రూ.29 లక్షలు ఖర్చు చేస్తే చిత్తూరులో టీడీపీ అభ్యర్థి రూ.38 లక్షలు పెట్టారు. అలాగే రాజంపేటలో వైసీపీ అభ్యర్థి మిథున్ రెడ్డి రూ.15 లక్షలు పెడితే చిత్తూరు వైసీపీ అభ్యర్థి రెడ్డెప్ప రూ.23 లక్షలు వెచ్చించారు. వీరందరికంటే రాజంపేట కాంగ్రెస్‌ అభ్యర్థి షాజహాన్ అత్యధికంగా ఖర్చు చేయడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun : 21 ఏళ్ళకు ఎంట్రీ, 22 ఏళ్ళ కెరీర్ లో ఎత్తుపల్లాలు చూసిన బన్నీ

మాతృ మూవీ లో చూస్తున్నవేమో.. పాటను అభినందించిన తమ్మారెడ్డి భరద్వాజ్

Mad Square Review : మ్యాడ్ స్క్వేర్ రివ్యూ

Photos in Sydney: ఫోటోలను క్లిక్ మనిపించింది ఎవరు..? సమంత సమాధానం ఏంటంటే?

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments