Webdunia - Bharat's app for daily news and videos

Install App

గరుడ వంతెన : త్వరలో నెరవేరనున్న తిరుపతి వాసుల కల

Webdunia
బుధవారం, 2 ఫిబ్రవరి 2022 (12:49 IST)
తిరుపతి వాసుల దశాబ్దాల కల త్వరలో నెరవేరనుంది. తిరుపతి బస్టాండు నుంచి అలిపిరి వరకు రూ.75 కోట్ల వ్యయంతో నిర్మించిన వంతెన మరో పది రోజుల్లో అందుబాటులోకిరానుంది. ఈ వంతెన నిర్మాణ వ్యయం రూ.648 కోట్లు. అయితే, నిధులను తితిదే దశల వారీగా విడుదల చేస్తుంది. 
 
తితిదే, తిరుపతి స్మార్ట్ సిటీ కార్పొరేషన్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారీ ఫ్లైఓవర్ గరుడ వారధి వారం, పది రోజుల్లో అందుబాటులోకి రానుంది. తొలి దశలో చేపట్టిన ఈ వంతెన నిర్మాణ పనులు పూర్తి చేశారు. మొత్తం ఆరు కిలోమీటర్ల మేరకు ఈ భారీ ఫ్లైవర్‌ను నిర్మిస్తున్నారు. 
 
మూడేళ్ళ క్రితం ప్రారంభించిన ఈ ఫ్లైఓవర్ నిర్మాణం చివరికి తొలి ఫేజ్ పూర్తి చేసుకుంది. ఫ్లైఓవర్ నిర్మాణ ఖర్చుతో తితిదే 67 శాతం నిధులు కేటాయించగా తిరుపతి స్మార్ట్ సిటీ కార్పొరేషన్ నిధుల నుంచి33 శాతం కేటాయిస్తున్నారు. అయితే, కరోనా కారణంగా ఆదాయం తగ్గడంతో తితిదే కేవలం 75 కోట్ల రూపాయలను విడుదల చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments