ఆంధ్రా విశ్వవిద్యాలయంలో గంజాయి విక్రయిస్తున్న సెక్యూరిటీ గార్డులు

Webdunia
సోమవారం, 13 ఫిబ్రవరి 2023 (07:53 IST)
దేశంలో ఉండే గొప్ప విశ్వవిద్యాలయాల్లో ఒకటిగా గుర్తింపు పొందిన ఆంధ్రా విశ్వవిద్యాలయంలో గంజాయి కలకలం సృష్టించింది. ఇక్కడ పని చేసే సెక్యూరిటీ గార్డులే ఈ గంజాయిని విక్రయిస్తున్న విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. దీంతో రంగంలోకి దిగిన యూనివర్శిటీ పోలీసులు నలుగురు సెక్యూరిటీ గార్డులను అరెస్టు చేశారు. ఒకరు పరారీలో ఉన్నారు. అలాగే, రెండు వాహనాలను పోలీసులు సీజ్ చేశారు.
 
యూనివర్శిటీలో గత కొన్ని రోజులుగా మత్తు పదార్థాలు విక్రయాలు జరుగుతున్నట్టు సమాచారం రావడంతో పోలీసులు మఫ్టీలో నిఘా వేశారు. ఈ క్రమంలో పక్కా సమాచారంలో విశాఖ త్రీ టౌన్ పోలీసులు గత శుక్రవారం రాత్రి గంజాయి ఉందన్న సమాచారంతో బీచ్ రోడ్డులో ఉన్న యోగా విలేజ్‌లో ఆగివున్న ఓ ఆటోలో సోదాలు చేశారు. 
 
ఇందులో చిన్నచిన్న ప్యాకెట్లలో గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఈ డ్రగ్స్ దందాలో ఏయూ భద్రతా అధికారి కారు డ్రైవర్ ప్రధాన సూత్రధారిగా ఉన్నట్టు భావిస్తున్నారు. ఈయన సహకారంతో సెక్యూరిటీ గార్డులు ఈ గంజాయిని విద్యార్థులకు చేరవేస్తున్నట్టు ప్రాథమిక విచారణలో పోలీసులు గుర్తించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

సినిమా పెట్టుబడి రూ.50 లక్షలు.. 54రోజుల్లో రూ.100 కోట్ల కలెక్షన్లు

టాలీవుడ్ ప్రముఖులతో సమావేశమైన కొరియన్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ యూ ఇన్-సిక్

సినిమాకు శృంగారం, సెక్సువల్ డిజైర్స్ ఇతివృత్తంగా తీసుకున్నా : ఎన్ హెచ్ ప్రసాద్

Aadi Pinishetti: ఆది పినిశెట్టి థ్రిల్లర్ మూవీ డ్రైవ్ రిలీజ్ కు సిద్దం.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments