Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమిళనాడు ఆర్టీసీ బస్సులో... తడ వ‌ద్ద గంజాయి పట్టివేత

Webdunia
శుక్రవారం, 10 డిశెంబరు 2021 (19:37 IST)
పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, తడ మండలం, బీవీ పాలెం ఉమ్మడి తనిఖీ కేంద్రం వద్ద  శుక్రవారం స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు చేపట్టిన వాహన తనిఖీలలో 12 కేజీల గంజాయిని పట్టుకున్నారు. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఇన్స్పెక్టర్ ఆర్ యు వి ఎస్ ప్రసాద్ తెలిపిన వివరాల మేరకు అడిషనల్ ఎస్పీ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో నెల్లూరు ఆదేశాల ప్రకారం వివిపాలెం ఉమ్మడి తనిఖీ కేంద్రం వద్ద వాహన తనిఖీలు చేప‌ట్టారు. నెల్లూరు నుండి చెన్నైకి వెళుతున్నతమిళనాడు ఆర్టీసీ బస్సులో  ప్రయాణిస్తున్న కేరళ రాష్ట్రానికి చెందిన శంకత్ అలీ, శన్వస్ ఇద్దరు వ్యక్తుల నుండి 12 కేజీల గంజాయి పట్టుకోవడంతో పాటు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. 

 
పట్టుబడిన వ్యక్తులు విచారించగా ఆంధ్రప్రదేశ్లోని అన్నవరం ప్రాంతం నుండి  కొనుగోలు చేసిన 12 కేజీల గంజాయిని కేరళ రాష్ట్రంలో కేజీ 20 వేల చొప్పున విక్రయిస్తున్న‌ట్లు విచారణలో నిందితులు తెలిపారు. వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సి ఐ ప్రసాద్ తెలిపారు. ఈ దాడుల్లో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్  సిఐతో పాటు ఎస్ ఐ ప్రతాప్ కుమార్, హెడ్ కానిస్టేబుల్ ఎస్ ఎన్ రసూల్, కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు పి వెంకటేశ్వర్లు ఎం ప్రభాకర్ రావు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప'కు షాకిచ్చిన రివిజన్ కమిటీ

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments