పొరుగు రాష్ట్ర పోలీసులు అలా చెబుతుంటే ముఖ్యమంత్రికి సిగ్గు అనిపించడం లేదా?: చంద్రబాబు

ఐవీఆర్
శనివారం, 23 మార్చి 2024 (18:25 IST)
దేశంలో ఎక్కడ గంజాయి కేసులు వెలుగుచూసినా ఆ కేసు మూలాలు ఏపీలో వుంటున్నాయనీ, ఇది దౌర్భాగ్యకరమైన విషయం అంటూ తెదేపా చీఫ్ చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేసారు. ఈ సందర్భంగా ఆయన తన ట్విట్టర్ హ్యాండిల్‌లో ఇలా రాసారు.
 
''ఏపీలోని గంజాయి మాఫియా మన రాష్ట్ర ప్రజలనే కాదు, పొరుగు రాష్ట్రాల వారిని కూడా ప్రమాదంలోకి నెట్టేసింది. తెలంగాణ రాష్ట్రం, జగిత్యాలలో గంజాయి ముఠా అరెస్ట్ సమయంలో వెలుగు చూసిన వాస్తవాలు నివ్వెర పరిచాయి. గంజాయి విక్రయిస్తున్న ఈ ముఠాకి విశాఖ లోని సీలేరు నుంచి గంజాయి సరఫరా కావడం ఎంతో ఆందోళన కలిగిస్తోంది. మన రాష్ట్రంలో గంజాయి అమ్మకాల గురించి పొరుగు రాష్ట్ర పోలీసులు చెపుతుంటే ఈ ముఖ్యమంత్రికి సిగ్గు అనిపించడం లేదా? ఈ అధికారులకు అవమానకరం కాదా?
 
దేశంలో ఎక్కడ ఏ గంజాయి కేసుకైనా మూలాలు ఆంధ్రప్రదేశ్ లో ఉండటం జగన్ రెడ్డి పాలనా దౌర్భాగ్యం. నిన్ననే 25,000 కిలోల డ్రగ్స్ విశాఖ పోర్టులో పట్టుబడ్డాయి. రాష్ట్రాన్ని ఇలా అభాసుపాలు చేసిన జగన్ గ్యాంగ్ పాపాలకు ప్రజలే శిక్ష విధిస్తారు. నాడు అభివృద్దిలో దేశంలో వెలిగిన మన రాష్ట్రం...నేడు గంజాయితో చీకట్లలోకి వెళ్ళిపోయింది.'' 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhanda 2 date: బాలక్రిష్ణ అఖండ 2 రిలీజ్ డేట్ ను ప్రకటించిన నిర్మాతలు - డిసెంబర్ 12న రిలీజ్

ఆహ్వానించేందుకు వచ్చినపుడు షూటింగ్‌లో డ్యాన్స్ చేస్తున్నా : చిరంజీవి

పవన్ కల్యాణ్‌కు మొండి, పట్టుదల ఎక్కువ.. ఎక్కడా తలొగ్గడు.. జయసుధ (video)

శాంతారామ్ బయోపిక్‌లో తమన్నా.. పోస్టర్ రిలీజ్ చేసిన టీమ్.. లుక్ అదుర్స్

శర్వా... నారి నారి నడుమ మురారి రిలీజ్-ముహూర్తం ఖరారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, తులసి పొడిని తేనెలో కలిపి తాగితే...

పది లక్షల మంది పిల్లల్లో ప్రకటనల అక్షరాస్యతను పెంపొందించే లక్ష్యం

తమలపాకులు ఎందుకు వేసుకోవాలి?

సులభంగా శరీర బరువును తగ్గించే మార్గాలు

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

తర్వాతి కథనం
Show comments