Webdunia - Bharat's app for daily news and videos

Install App

అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా గుంటూరు

Webdunia
ఆదివారం, 3 ఏప్రియల్ 2022 (12:43 IST)
ఏపీలోని గుంటూరు నగర శివారు ప్రాంతాలు అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారిపోతున్నాయి. ఏ ప్రాంతంలో గ్యాంగ్ వార్ నానాటికీ పెరిగిపోతోంది. అల్లరి మూకల ఆగడాలకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. నడిరోడ్డుపైనే దాడులకు పాల్పడుతున్నప్పటికీ పోలీసులు మాత్రం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. 
 
ఈ జిల్లాలోని మంగళగిరి రూరల్ పరిధిలో ఓ హోటల్ వద్ద అర్థరాత్రి సమయంలో టిఫన్, భోజనం సరఫరా చేయలేదన్న కోపంతో కొందరు యువకులు మద్యం సేవించి హోటల్‌ను ధ్వంసం చేసి సిబ్బందిపై దాడికి పాల్పడ్డారు. వారిని అడ్డుకున్న వాచ్‌మెన్‌ను కూడా కత్తితో పొడిచి భయభ్రాంతులకు గురిచేశారు. 
 
అలాగే, గుంటూరు జిల్లా నల్లపాడు స్టేషన్‌కు కూతవేటు దూరంలోని స్వర్ణభారతి నగర్‌లో అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారింది. ఈ ప్రాంతం నగరానికి దూరంగా ఉడటం, జన సంచారం లేకపోవడంతో అక్కడ ఏం జరిగినా పోలీసులకు తెలియడం లేదు. ఈ క్రమంలో మూడు రోజుల క్రితం రెండు వర్గాల మధ్య గ్యాంగ్ వార్ జరిగింది. 
 
ఆ ప్రాంతంలోని రెండు సామాజిక వర్గాలకు చెందిన యువకులు ఆధిపత్యం పోరులో భాగంగా ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఆ సమయంలో రోడ్డుపై నడిచి వెళుతున్న యువకుడిని బంధించి తీవ్రంగా కొట్టారు. ఇంత జరుగుతున్నప్పటికీ పోలీసుల్లో మాత్రం ఏమాత్రం చలనం లేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments