Webdunia - Bharat's app for daily news and videos

Install App

విదేశాల్లో విలాసాలు... లగ్జరీ హోటళ్లలో జల్సాలు... థాయ్‌లో మసాజ్‌లు

మల్టీలెవల్ మార్కెటింగ్ పేరుతో సుమారుగా 60 లక్షల మందిని వరకు మోసం చేసి వందల కోట్ల రూపాయలను కొల్లగొట్టిన కేటుగాళ్ళ వ్యవహారం బట్టబయలైంది. ఖరీదైన కార్లలో తిరుగుతూ, లగ్జరీ హోటళ్లలో జల్సాలు చేస్తూ, విదేశాల్

Webdunia
శనివారం, 22 సెప్టెంబరు 2018 (15:47 IST)
మల్టీలెవల్ మార్కెటింగ్ పేరుతో సుమారుగా 60 లక్షల మందిని వరకు మోసం చేసి వందల కోట్ల రూపాయలను కొల్లగొట్టిన కేటుగాళ్ళ వ్యవహారం బట్టబయలైంది. ఖరీదైన కార్లలో తిరుగుతూ, లగ్జరీ హోటళ్లలో జల్సాలు చేస్తూ, విదేశాల్లో విలాసాలు నేపాల్‌, థాయ్‌లాండ్‌లో మసాజ్‌లు చేయించుకుంటూ జీవితం అంటే ఇలావుండాలి అన్నట్టుగా ఎంజాయ్ చేశారు.
 
ఆ కేటుగాళ్లు ఇపుడు జైలు ఊచలు లెక్కిస్తున్నారు. వారు ఎవరో కాదు. ఫ్యూచర్‌ మేకర్‌ సంస్థ పేరుతో హెల్త్‌ ప్రొడక్టులను మార్కెటింగ్‌ చేస్తామంటూ అమాయక ప్రజలను నమ్మించి మోసం చేసిన రాధేశ్యామ్‌, సురేందర్‌ సింగ్‌, బన్సీలాల్‌. మల్టీలెవల్ మార్కెటింగ్ పేరుతో స్కీం పేరుతో భారీ స్కామ్‌కు తెరతీసి వేల కోట్ల రూపాయలు దోచుకున్నారు. ఈ గజ మోసగాళ్లను ఇటీవల ఈవోడబ్ల్యూ పోలీసులు రంగప్రవేశం చేసి అరెస్టు చేశారు. 
 
వీరి గృహాల్లో సోదాలు నిర్వహించగా, రూ.60 లక్షల నగుదుతో పాటు ఖరీదైన వస్తువులు, బంగారు, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే, ఒక పిస్తోలు, 10 బుల్లెట్లు, మూడు లగ్జరీ కార్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఈవోడబ్ల్యూ పోలీసులు వేగం పెంచారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments