Webdunia - Bharat's app for daily news and videos

Install App

మామిడి తోటలో పరాయి వ్యక్తితో భార్య... కళ్లారా చూసిన భర్త ఏం చేశాంటే?

వివాహేతర సంబంధాలు మానవసంబంధాలకు మాయనిమచ్చగా మారుతున్నాయి. కట్టుకున్న భర్త ఉన్నప్పటికీ పరాయి పురుషుల సుఖానికి కొంమంది మహిళలు వెంపర్లాడుతున్నారు.

Webdunia
శుక్రవారం, 16 మార్చి 2018 (14:27 IST)
వివాహేతర సంబంధాలు మానవసంబంధాలకు మాయనిమచ్చగా మారుతున్నాయి. కట్టుకున్న భర్త ఉన్నప్పటికీ పరాయి పురుషుల సుఖానికి కొంమంది మహిళలు వెంపర్లాడుతున్నారు. ఇవి అనేక నేరాలు, ఘోరాలకు దారితీస్తున్నాయి. తాజాగా, తూర్పు గోదావరి జిల్లా రౌతులపూడి గ్రామంలో ఓ వివాహేతర సంబంధం వెలుగులోకి వచ్చింది.
 
మామిడి తోటలో కట్టుకున్న భార్య పరాయి పురుషుడితో అభ్యంతరకర భంగిమలో ఉండటాన్ని చూసిన ఆ భర్త తట్టుకోలేకపోయాడు. దీంతో భార్యతో పాటు.. అమెతో ఉన్న వ్యక్తిపై కత్తితో దాడి చేశాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
తూర్పుగోదావరి జిల్లా కొత్తి కొట్టాం గ్రామానికి చెందిన అడిగర్ల నూకరత్నం అనే మహిళకు దిగిశివాడకు చెందిన అప్పలనాయుడుతో పదేళ్ల క్రితం వివాహమైంది. భార్య తరచూ ఎవరితోనో ఫోన్‌లో మాట్లాడుతూ ఉండేది. గురువారం అదే గ్రామానికి చెందిన పి.శ్రీనుతో జీడిమామిడి తోటలో అభ్యంతరకర భంగిమలో ఉండటాన్ని గమనించాడు. 
 
ఆ వెంటనే ఆగ్రహానికి గురైన అప్పలనాయుడు వారిపై కత్తితో దాడి చేశాడు. శ్రీను పారిపోగా నూకరత్నంకు మెడ, తలపై గాయాలయ్యాయి. స్థానికులు బంధువుల సహాయంతో తుని ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అప్పలనాయుడును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments